Curd: పెరుగు మంచిదే కానీ, వీటితో కలిపి తింటే చాలా ప్రమాదం..!

Published : May 09, 2026, 12:06 PM IST

Curd: ఎండ వేడి తట్టుకోలేక రోజూ పెరుగు తింటున్నారా? పెరుగు ఆరోగ్యానికి మంచిదే కానీ, కొన్ని రకాల ఫుడ్స్ తో పెరుగు కలిపి తీసుకోకూడదని మీకు తెలుసా?  వేటితో తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయో తెలుసా? 

PREV
13
curd

రోజు రోజుకీ బయట ఎండలు మండిపోతున్నాయి. ఈ ఎండలో చల్లదనం కోసం చాలా మంది పెరుగు తీసుకుంటారు. పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. కడుపులో చల్లగా కూడా ఉంటుంది. అయితే.. ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు అందించినా కూడా... పెరుగును కొన్ని రకాల ఫుడ్స్ తో కలిపి అస్సలు తీసుకోకూడదు. మరి, వేటితో కలిపి పెరుగు తీసుకోకూడదు.. అనే విషయం ఇప్పుడు తెలుసుకుందాం...

23
1.పండ్లు...

చాలా మందికి పెరుగు అన్నంలో పండ్లు తినే అలవాటు ఉంటుంది. కానీ.. ఇలా తినకూడదు. ఇలా పెరుగుతో కలిపి పండ్లు తినడం అందరికీ సెట్ అవ్వదు. ముఖ్యంగా నారింజ, పైనాపిల్, మామిడి పండ్లు పెరుగుతో కలిపి అస్సలు తినకూడదు. ఇలా తినడం వల్ల గ్యాస్, మలబద్దకం, ఎసిడిటీ వంటి సమస్యలు రావచ్చు. జీర్ణ సంబంధిత సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

2.చేపలు, మాంసాహారం...

చేపలు లేదా మాంసాహారంతో పెరుగు కలిపి తినడం మంచిది కాదు. ఆయుర్వేదం ప్రకారం, పెరుగులో వీటిని కలిపి తినడం వల్ల శరీరంలో టాక్సిన్స్ విడుదలయ్యే ప్రమాదం ఉంది. దీని వల్ల అలర్జీలు, దురద వంటి చర్మ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంది. జీర్ణ సంబంధిత సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది.

33
3.పాలు...

పాలు,పెరుగు రెండూ పాల ఉత్పత్తులే.. కాబట్టి, ఈ రెండింటినీ కలిపి తీసుకోకూడదు. ఈ రెండూ కలిపి తీసుకుంటే.. కడుపు ఉబ్బరం, అజీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

వేయించిన ఆహారాలు

పెరుగు, వేయించిన ఆహార పదార్థాలను కలిపి తినడం కూడా మంచిది కాదు. పరోటా, పకోడా, పూరీలతో పాటు పెరుగును ఎక్కువగా తినడం వల్ల బరువు పెరగడం, నీరసం వంటివి కలుగుతాయి. ఇది జీర్ణక్రియను నెమ్మదింపజేసి, గ్యాస్‌ను పెంచుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories