తయారీ విధానం
ముందుగా బియ్యాన్ని శుభ్రంగా కడిగి, 30 నిమిషాలు నానబెట్టి తర్వాత వడకట్టాలి. పాన్ లేదా గిన్నెలో నూనె గాని నెయ్యి గాని వేసి వేడి చేసి ఏలకులు, లవంగాలు, లవంగపట్ట, సోంపు, దాల్చిన చెక్క, మిరియాలు, ఎండు మిరపకాయలు వేసి బాగా సువాసన వచ్చే వరకు వేయించాలి.
తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించి, ఆపై పచ్చిమిర్చి, టొమాటో, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మెత్తగా ఉడకనివ్వాలి. పసుపు, కారం, ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలిపి 5 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత 2 1/2 కప్పుల నీరు పోసి మరిగించాలి.
తరువాత బియ్యం వేసి నెమ్మదిగా కలిపి, మూత పెట్టి తక్కువ మంట మీద 15 నుంచి 20 నిమిషాలు ఉడకనివ్వాలి. చివరగా, పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం వేసి 5 నిమిషాలు తర్వాత వడ్డించుకోవాలి.