తయారీ విధానం
ముందుగా మసాలా తయారీకి డ్రై పదార్థాలను వేయించి, చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. శుభ్రంగా కడిగిన మటన్లో పెరుగు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, కొద్దిగా పుదీనా, కొత్తిమీర వేసి 30 నిమిషాలు నానబెట్టాలి. కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసి, ఉల్లిపాయలను బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటా, మసాలా పొడి, ధనియాల పొడి, కారం వేసి బాగా వేయించాలి.
నానబెట్టిన మటన్ను వేసి 15-20 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. బియ్యాన్ని కడిగి, తగినంత నీరు (1:2 నిష్పత్తి) వేసి మరిగించాలి. పుదీనా, కొత్తిమీర వేసి, బియ్యాన్ని అందులో వేసి నెమ్మదిగా కలిపి, మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి.