ఆంబూర్ బిర్యానీ తయారీ విధానం:
ముందుగా మసాలా తయారీకి పదార్థాలను వేయించి, మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. మటన్ను శుభ్రం చేసి పెరుగు, పసుపు, ఉప్పు, అల్లం-వెల్లుల్లి పేస్ట్ వేసి 30 నిమిషాలు నానబెట్టాలి. దీనివల్ల మటన్ మెత్తగా అవుతుంది. కళాయిలో నూనె లేదా నెయ్యి వేసి వేడి చేసి, ఉల్లిపాయలను వేయించాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి, టమాటా, మసాలా పొడి, కారం వేసి బాగా వేయించాలి.
నానబెట్టిన మటన్ను వేసి 15-20 నిమిషాలు మూత పెట్టి ఉడికించాలి. బియ్యాన్ని కడిగి, తగినంత నీరు వేసి మరిగించాలి. పుదీనా, కొత్తిమీర వేసి, బియ్యాన్ని అందులో వేసి నెమ్మదిగా కలిపి, మూత పెట్టి 15 నిమిషాలు ఉడికించాలి.