కండరాలు బలోపేతం
అన్నం, పప్పును కలుపుకుని తింటే కండరాలు బలోపేతం అవుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు పప్పు అన్నం తింటే దంతాలు కూడా స్ట్రాంగ్ గా ఉంటాయి. దంతాల సమస్యలు వచ్చే రిస్క్ కూడా తగ్గుతుంది.
ఉబ్బరం నుంచి ఉపశమనం
పప్పు అన్నం తినడం వల్ల కడుపు ఉబ్బరం సమస్య నుంచి కూడా ఉపశమనం కలుగుతుంది. అలాగే ఇది ప్రేగు కదలికను సులభతరం చేస్తుంది. దీంతో మీకు మలబద్దకం అనే సమస్యే ఉండదు. ఒకవేళ మలబద్దకం సమస్య ఉన్నా సులువుగా బయటపడతారు.