పెరుగు కర్రీ ఎలా తయారు చేయాలంటే..
కావాల్సిన పదార్థాలు..
పెరుగు 1కప్పు, నీళ్లు 1 కప్పు, ఎండు మిరపకాయలు 2, ఆవాలు, కరివేపాకు, ఉప్పు సరిపడినంత, కొబ్బరి తురుము రెండు స్పూన్లు, జీలకర్ర 1 స్పూన్, పచ్చి మిరపకాయలు 2
మీ దగ్గర కూరగాయలు లేకపోయినా పర్వాలేదు. ఉంటే కనుక బెండకాయ, వంకాయ లాంటి వాటిని కలిపితే రుచి అద్భుతంగా ఉంటుంది.
పెరుగు గ్రేవీ కర్రీ తయారు చేసే విధానం..
ముందుగా మీ దగ్గర కూరగాయలు ఉంటే... వంకాయ, బెండకాయ ఏదైనా పర్వాలేదు.. చిన్న ముక్కలుగా కోసుకోవాలి. తర్వాత.. కొబ్బరి తురుము, జీలకర్ర, పచ్చి మిరపకాయలను బ్లెండర్ లో వేసి మెత్తని పేస్టులాగా చేసుకోవాలి. మరోవైపు ఒక గిన్నెలో పెరుగు తీసుకొని బాగా కలపాలి. అందులోనే నీళ్లు కూడా పోసి.. బాగా కలపాలి. పెరుగు పుల్లగా ఉంటే.. పచ్చిమిరపకాయలు మరో రెండు ఎక్కువ వేసుకోవచ్చు. పులుపు తగ్గుతుంది.
ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, ఎండు మిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేయాలి. పోసు వేగిన తర్వాత.. ముక్కలు కోసుకున్న కూరగాయల ముక్కలు వేసుకోవాలి. రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి. ( మీ దగ్గర కూరగాయలు లేకపోతే.. ఈ స్టైప్ స్కిప్ చేయండి). తర్వాత.. ముందుగా రుబ్బి ఉంచుకున్న పచ్చి మిరపకాయ, కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేయాలి. దీనిని కూడా కాసేపు వేగనివ్వాలి. ఇప్పుడు.. అందులో పెరుగు మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి. మీడియం మంట మీద ఉంచి.. సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలపాలి. రెండు నిమిషాలు ఉడకనిచ్చి.. స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది. చివరగా సన్నగా తురిమిన కొత్తమీర చల్లితే సరిపోతుంది. అంతే.. రుచి కరమైన పెరుగు కర్రీ తయారైనట్లే.