దేశంలో నారింజ సాగుకు, పంపిణీకి, వ్యాపారానికి నాగపూర్ అతిపెద్ద కేంద్రంగా మారిపోయింది. నగరంలో పెద్దపెద్ద మార్కెట్లు, శీతల గిడ్డంగి సౌకర్యాలు, బలమైన ఎగుమతి నెట్ వర్క్ వంటివి ఏర్పడ్డాయి. అందుకే నాగపూర్ ను ఆరెంజ్ సిటీగా పిలుచుకోవడం మొదలుపెట్టారు. నాగపూర్ ఆర్థిక వ్యవస్థ కూడా ఈ పండు చుట్టూనే తిరుగుతోంది. నగరం చుట్టుపక్కల నారింజ పండ్ల తోటలు అధికంగా కనిపిస్తాయి. టన్నుల కొద్దిగా నారింజలను ప్రతిరోజూ అమ్ముతూ ఉంటారు. ఎంతోమంది రైతులకు, వ్యాపారులకు జీవన ఉపాధి ఈ నారింజ పండ్లే. అందుకే ఆ నగరవాసులు ఏడాదికి ఒకసారి నాగపూర్ నారింజ పండుగను నిర్వహించుకుంటారు.