వందల మంది ఉండే రద్దీ ప్రదేశాల కంటే, ఏకాంతంగా ఉండే ప్రాంతాల వైపు యువత మొగ్గు చూపుతోంది. దీనికి ప్రధాన కారణాలు శాంతి, ప్రైవసీ, లోతైన సంభాషణలు. నగరాల్లో ఉండే ట్రాఫిక్ గోల, రెస్టారెంట్లలో ఉండే అరుపులు, కేకలు లేకుండా స్మశానాలు నిశ్శబ్దంగా ఉంటాయి.
ప్రైవసీ అంటే అక్కడ మనల్ని చూసేవారు ఉండరు, డిస్టర్బ్ చేసేవారు ఉండరు. అందుకే తమ మనసులోని మాటలను ఒకరికొకరు ధైర్యంగా చెప్పుకోవడానికి ఇది సరైన ప్రదేశమని కొందరు భావిస్తున్నారు. పాత సమాధులు, చెట్లు, పచ్చదనం మధ్య కూర్చున్నప్పుడు చిన్న చిన్న మాటలు కాకుండా.. జీవితం, భయం, కలల గురించి లోతైన చర్చలు వస్తాయని వోగ్ ఇండియా లాంటి పత్రికలు కూడా పేర్కొన్నాయి. ఇది ఒక రకంగా కంపాటబిలిటీ టెస్ట్ లాంటిదని డేటర్లు చెబుతున్నారు.