Train: ఈ రైలు 70 స్టేషన్లు మీదుగా ఆగకుండా ప్రయాణిస్తూనే ఉంటుంది.. ఎందుకో తెలుసా?

Published : Aug 03, 2026, 11:18 AM IST

Train: భారతీయ రైల్వే ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా నెట్ వర్క్. దీనిలో రోజూ లక్షలాది మంది ప్రయాణిస్తుంటారు. అయితే ఒక రైలు మాత్రం  70కి పైగా స్టేషన్లను దాటి వెళుతుంది. కానీ ఒక్కచోట కూడా ఆగదు. ఎందుకు ఆగదో తెలుసుకోండి.

PREV
13
ప్రత్యేకమైన రైలు

ప్రపంచంలోనే అతిపెద్ద రవాణా వ్యవస్థగా భారతీయ రైల్వే పేరు సంపాదించింది. ప్రతిరోజూ కోట్లాది మంది దీనిలో ప్రయాణిస్తూనే ఉంటారు. వందల రైళ్లలో ఒక ప్రత్యేకమైన రైలు ఉంది. అది ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్. ఈ రైలు బీహార్ రాష్ట్రం నుంచి చాలా దూరం ప్రయాణిస్తుంది. 70 స్టేషన్లు దాటి వెళుతున్నా ఒక్క స్టేషన్లో కూడా ఆగదు.  అక్కడ ప్రయాణికుల కోసం ఒక్క స్టేషన్‌లో కూడా ఆగకపోవడం దీనిలోని అసలు విశేషం. ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైలు  నెంబర్ 12820). ఇది ఢిల్లీలోని ఆనంద్ విహార్ టెర్మినల్ నుంచి భువనేశ్వర్ వరకు ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణంలో 12819 నంబర్‌తో భువనేశ్వర్ నుంచి ఆనంద్ విహార్‌కు వెళ్తుంది. ఈ రైలు సుమారు 1,782 కిలోమీటర్ల దూరాన్ని 28 గంటల 30 నిమిషాల్లో చేరుకుంటుంది. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల గుండా ఈ రైలు ప్రయాణిస్తుంది. అయితే కేవలం 13 ప్రధాన స్టేషన్లలో మాత్రమే ఇది ఆగుతుంది.

23
ఈ రాష్ట్రంలో ఒక్కచోటా ఆగదు

ఈ రైలుకు బీహార్ రాష్ట్రంలోని 70కి పైగా రైల్వే స్టేషన్లను దాటి వెళుతుంది.  పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్‌ దాటిన తర్వాత బీహార్‌లోకి ప్రవేశించే ఈ రైలు.. ససారం, గయా, మన్‌పూర్ సహా ఎన్నో ముఖ్యమైన స్టేషన్లను దాటుకుంటూ వెళ్తుంది. అయినా ఎక్కడా ఆగదు. ఇలా ఎందుకు ఈ రైలు ఎక్కడ ఆగకుండా ప్రయాణిస్తుందో తెలుసా?  ప్రయాణ సమయాన్ని తగ్గించడానికి. ప్రతిచోటా ఆగితే ప్రయాణ సమయం పెరిగిపోతుంది.

33
కేవలం 13 స్టేషన్లలోనే...

దేశంలోని వివిధ రాష్ట్ర రాజధానులను ఢిల్లీతో వేగంగా అనుసంధానించేందుకు భారతీయ రైల్వే సంపర్క్ క్రాంతి అనే సిరీస్‌ను ప్రారంభించింది. అందుకే కేవలం ప్రధాన జంక్షన్లు, సాంకేతికంగా అవసరమైన చోట్ల మాత్రమే రైలు ఆగేలా టైమ్‌టేబుల్ రూపొందించారు. దీనివల్ల చాలా దూర ప్రయాణాలు కూడా తక్కువ సమయంలో చేరుకోవచ్చు.

ఒక రైలు తక్కువ స్టాపులతో నడిస్తే అది గమ్య స్థానాన్ని త్వరగా చేరుకుంటుంది. తరచుగా ఆగకపోవడం వల్ల ప్రయాణ సమయం తగ్గడమే కాదు.. ఆలస్యం కూడా జరగదు. ఒడిశా సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ భారతీయ రైల్వేలోని ప్రత్యేకమైన సూపర్‌ఫాస్ట్ రైళ్లలో ఒకటి. ఈ రైలు చాలా మంది ప్రయాణికులకు ఇష్టమైన సర్వీస్‌గా కొనసాగుతోంది.

Read more Photos on
click me!

Recommended Stories