ఒక రోజు రామయ్య రమేశ్ను పిలిచి తలుపు చూపించాడు. "ఇవి చూడూ! మేకులతో తలుపు ఎంత అంద విహీనంగా మారిందో. నువ్వు కోప్పడినప్పుడు, ఎదుటివాళ్ల మనసులో కూడా ఇలాగే ఓ మచ్చ పడుతుంది," అని అన్నాడు. అప్పుడు రమేశ్ సిగ్గుపడి, "నాన్నా, ఇక నేను మారిపోతాను. ఎవరితో కోప్పడను అని చెప్తాడు.
రామయ్య చిరునవ్వుతో, "ఇది చాలా మంచిది! నువ్వు కోపాన్ని అదుపులో పెట్టుకున్న ప్రతిసారీ ఒక మేకును తీసేస్తూ ఉండు," అని చెప్పాడు. రోజులు గడిచాయి… రమేశ్ ఓర్పుగా ఉండటం ప్రారంభించాడు. ఒక్కో మేకును తీయడం ప్రారంభించాడు. కానీ, ప్రతి మేకు తీసిన చోటా ఓ చిన్నచిన్న చిల్లు మిగిలిపోయింది.