Soap History: ప్రస్తుతం సెల్ఫ్ కేర్ పెరిగింది. రకరకాల సబ్బులు, బాడీ వాష్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవేవి రోజుల్లో బారతీయులు వ్యక్తిగత శుభ్రతను ఎలా పాటించారు.? ఇందుకోసం ఏం ఉపయోగించారు.?లాంటి ఆసక్తికర విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.
సబ్బు రాకముందు భారతీయులు సహజ పదార్థాలను శుభ్రత కోసం వినియోగించేవారు. చెట్లు, మొక్కలు, విత్తనాలు వంటి వాటిలో సహజంగా ఉండే శుభ్రపరిచే లక్షణాలను గుర్తించి వాటిని స్నానానికి ఉపయోగించేవారు. ఇవి శరీరానికి హాని కలిగించకుండా శుభ్రతను కలిగించేవి. అందుకే ఆ కాలంలో ప్రజలు ఎక్కువగా ప్రకృతి ఆధారిత పద్ధతులపై ఆధారపడ్డారు.
26
రీటా (Soap Nut) – సహజ సబ్బుగా ఉపయోగం
రీటా లేదా సోప్ నట్స్ ప్రాచీన భారతదేశంలో చాలా ప్రాచుర్యంలో ఉన్న సహజ శుభ్రపరిచే పదార్థం. రీటాను నీటిలో నానబెట్టినా లేదా మరిగించినా సహజంగా నురుగు వస్తుంది. ఈ నురుగు సబ్బు లాంటి పని చేస్తుంది. దీనితో శరీరం, జుట్టు రెండూ శుభ్రం అవుతాయి. ముఖ్యంగా ఇందులో కఠిన రసాయనాలు లేకపోవడం వల్ల చర్మానికి హాని ఉండదు.
36
శీకాకాయ – జుట్టు శుభ్రతకు సంప్రదాయ పద్ధతి
శీకాకాయని సాధారణంగా జుట్టు శుభ్రం చేయడానికి ఉపయోగించేవారు. దీనిని కొందరు “హెయిర్ ఫ్రూట్” అని కూడా అంటారు. శీకాకాయ జుట్టులో ఉన్న మురికి, అధిక నూనెను తొలగిస్తుంది. అలాగే తల చర్మం సహజ సమతౌల్యాన్ని కూడా కాపాడుతుంది. అందుకే చాలా కాలం పాటు ఇది భారతీయుల హెయిర్ కేర్లో ముఖ్య భాగంగా ఉండింది.
ఉబ్టన్, ముల్తాని మట్టి – చర్మ సంరక్షణకు సహజ మార్గాలు
శనగపిండి, పసుపు, చందనం, పాలు లేదా మలై కలిపి ఒక ఉబ్టన్ తయారు చేసేవారు. దీనిని శరీరానికి రాసుకుని స్నానం చేసేవారు. ఇది చర్మాన్ని శుభ్రం చేయడంతో పాటు కాంతిని పెంచుతుంది. ముల్తాని మట్టిని కూడా చర్మంపై ఉపయోగించేవారు. ఇది చర్మంలోని అదనపు నూనెను పీల్చుకుని చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది. గ్రామాల్లో కొంతమంది చెక్కల బూడిదను కూడా శుభ్రపరిచే పదార్థంగా ఉపయోగించేవారు.
56
నూనె మర్దన తరువాత శుభ్రపరిచే సంప్రదాయం
మరొక సంప్రదాయ పద్ధతి శరీరానికి ముందుగా నూనె మర్దన చేయడం. ఆ తర్వాత మూలికల పొడి లేదా మట్టితో రుద్ది శరీరాన్ని శుభ్రం చేసేవారు. ఈ విధానం శరీరానికి విశ్రాంతి ఇవ్వడమే కాకుండా చర్మ ఆరోగ్యానికి కూడా మంచిదిగా భావించేవారు.
66
భారతదేశంలో ఆధునిక సబ్బుల ప్రారంభం
ఆధునిక సబ్బులు భారతదేశంలో 19వ శతాబ్దం చివరలో ప్రవేశించాయి. లీవర్ బ్రదర్స్ వంటి కంపెనీలు లైఫ్బాయ్ వంటి ఉత్పత్తులను మార్కెట్లోకి తీసుకొచ్చాయి. 1897లో మీరట్లో భారతదేశపు మొదటి సబ్బు కర్మాగారం స్థాపించారు. తరువాత జంసెద్జీ టాటా, అర్దేశిర్ గోద్రేజ్ వంటి పారిశ్రామికవేత్తలు స్వదేశీ భావనతో వృక్ష ఆధారిత సబ్బులను అభివృద్ధి చేశారు. దీంతో భారతదేశంలో సబ్బుల వినియోగం వేగంగా పెరిగింది.