పావురాలు, కోయిలలు, రామ చిలుకలు, పిచుకలు, మైనా లు, కొంగలు అన్ని రకాల పక్షులు వచ్చాయి. కానీ, కాకులు మాత్రం రాలేదు. చాలా సేపు కాకుల కోసం ఎదురు చూశాయి. అవి రాకపోవడంతో.. మిగిలిన పక్షులన్నీ మీటింగ్ మొదలుపెట్టాయి. చాలా మంది పక్షులు గుడ్ల గూబ కొత్త రాజు అయితే బాగుంటుందని నిర్ణయించాయి.
‘ గుడ్ల గూబ చాలా తెలివైనది. రాత్రి పూట కూడా చూడగలదు. మనందరినీ కాపాడగలదు’ అని ఓ రామ చిలుక చెప్పింది. మిగిలిన పక్షులన్నీ నిజమే.. మాకు కూడా ఒకే అని ఒప్పుకున్నాయి. సరిగ్గా అదే సమయంలో కాకుల పెద్ద అడుగుపెట్టింది. కాకులన్నింటి తరుపున వచ్చిన కాకి అది. వచ్చీ రాగానే.. మీటింగ్ లో ఏం తేల్చారు అని ఇతర పక్షులను అడిగింది. దీంతో.... తాము గుడ్ల గూబను రాజుగా ఎన్నుకున్నామనే విషయాన్ని కాకి కి చెప్పాయి.