Published : Feb 17, 2025, 06:38 PM ISTUpdated : Feb 17, 2025, 06:44 PM IST
టాలీవుడ్ లో ఒక్క సినిమాతో సంచలనంగా మారిన హీరో.. రీసెంట్ గా మహాకుంభమేళాలో ప్రత్యక్ష్యం అయ్యాడు. మెడ నిండా రుద్రాక్షలతో టాలీవుడ్ స్టార్ హీరో, మహాకుంభమేళాలో మెరిసిన ఈ స్టార్ ను గుర్తు పట్టారా?
ప్రయాగరాజ్లో జరుగుతున్న మహా కుంభంలో స్టార్ సెలబ్రిటీలు సందడి చేస్తున్నారు. టాలీవుడ్ నుంచి కూడా స్టార్స్ అక్కడ హడావిడి చేస్తుండగా.. టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గామరిని యంగ్ హీరో ఫ్యామిలీతో సహా అక్కడ కనిపించాడు. ఇంతకీ ఈ హీరోను గుర్తు పట్టారా..?
రుద్రాక్ష మాల, నుదుట తిలకం, కాషాయ వస్త్రధారణలో ఉన్న ఈ హీరో విజయ్ దేవరకొండ. తన కుటుంబం, స్నేహితులతో కలిసి కుంభమేళాలో కనిపించారు. ఈ ఫోటోలను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
“2025 కుంభమేళా. స్నేహితులతో జ్ఞాపకాలు, అమ్మతో ప్రార్థనలు” అంటూ విజయ్ ఈ ఫోటోలకు క్యాప్షన్ ఆడ్ చేశారు. పక్కాగా ఆధ్యాత్మిక వస్త్రధారణలో ఆయన కనిపించారు. స్నేహితులతో సరదాగా ఫోటోలు తీసుకున్నారు విజయ్.
విజయ్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ గా మారిన ఆయన..ఆతరువాత గీతగోవిందం సినిమాతో మరో హిట్ కొట్టాడు. ఇక అప్పటి నుంచి సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్నాడు విజయ్ దేవరకొండ.
ఎన్నిప్రనయత్నాలు చేసినా.. లాభం లేకుండా పోయింది. ఇక గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో కింగ్ డమ్ చేస్తున్నాడు విజయ్. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది. మరి ఈసినిమా ఎలా ఉంటుందో చూడాలి.