బాలకృష్ణ హీరోగా నటించిన `వీరసింహారెడ్డి` సినిమాలో శృతి హాసన్ కథానాయికగా నటించగా, వరలక్ష్మి శరత్ కుమార్, రోసీ, కీలక పాత్రలు పోషించారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించారు. ఈ నలుగురు బాలయ్య షోలో సందడి చేశారు. శృతి హాసన్ తప్ప, మిగిలిన వాళ్లు దర్శకుడు గోపీచంద్, రోసి, వరలక్ష్మి, నిర్మాత రవిశంకర్, నవీన్ ఇందులో పాల్గొని సందడి చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలను ఆహా విడుదల చేయగా, అవి వైరల్ అవుతున్నాయి. శృతి హాసన్ అనారోగ్యానికి గురైన విషయం తెలిసిందే. ఈ కారణంగానే ఆమె షోకి రాలేదని సమాచారం.