Guppedantha Manasu: వసు ఇంటి నుంచి వెళ్లిపోయిన రిషి.. మాస్టర్ ప్లాన్ వేసిన వసుధార?

First Published Jan 5, 2023, 7:53 AM IST

Guppedantha Manasu: బుల్లితెర పై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. కాలేజ్ లో లెక్చరర్ కు స్టూడెంట్ కు మధ్య కలిగే ప్రేమ కథతో సీరియల్ కొనసాగుతుంది. ఇక ఈరోజు జనవరి 4వ తేదీ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం.
 

ఈరోజు ఎపిసోడ్ లో వసుధార చేతులు జోడించి ఏడుస్తూ దయచేసి వెళ్లిపోండి సార్ అనడంతో అప్పుడు రిషి వసుధారనీ పట్టుకొని నన్ను వెళ్ళమంటున్నావా అనడంతో వెళ్ళమంటుంది కదా సరే వెళ్ళండి అని రాజీవ్ అనడంతో రేయ్ అంటాడు రిషి. అప్పుడు రిషి బాధతో మాట్లాడక వసుధార  నన్ను వెళ్లిపోమనుకున్నావా అని అడగగా వసుధార ఏడుస్తూ ఉంటుంది. వసు గడ్డం పట్టుకొని మనిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాము కదా పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నాం కదా నిన్ను ఎవరైనా బెదిరించారా అని కోపంగా అడుగుతాడు రిషి. నీకు నేనున్నాను అని అనడంతో రిషినీ దూరంగా నెట్టేస్తుంది వసుధార.
 

దయచేసి వెళ్లిపోండి అని గట్టిగా అరుస్తూ మీకు మళ్ళీ చెబుతున్నాను ఇది మా ఫ్యామిలీ సమస్య దయచేసి వెళ్ళిపోండి అనడంతో రిషి బాధపడుతాడు. అప్పుడు రిషి,వసు వైపు అలాగే చూస్తూ ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు వసు బాధతో ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు జగతి కోపంతో రగిలిపోతూ వసుధార చెయ్యి పట్టుకుని పిచ్చి పట్టిందా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నావు అని అడుగుతుంది. ఈ పెళ్లేంటి,  నువ్వు పెళ్లి కూతురుగా రెడీ అవ్వడం ఏంటి? నీ పెళ్లి గురించి మాట్లాడడానికి కదా ముందు రమ్మన్నావు. ఇప్పుడు ఇలా ఎందుకు చేస్తున్నావు ఏమైంది వసు నీకు అని కోపంతో మాట్లాడుతుంది జగతి. మహేంద్ర ఏమైంది తనకు అనడంతో అప్పుడు వసుధర చేతులు జోడించి మేడమ్ ప్లీజ్ వెళ్ళిపోండి అని అంటుంది.

దాంతో జగతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏమీ అడగవద్దు అని ఏడుస్తూ మాట్లాడుతుంది వసుధార. అప్పుడు మహేంద్ర కోపంతో రగిలిపోతూ మమ్మల్ని వెళ్ళమంటున్నావా రిషి ని వెళ్ళమంటావా గొప్ప కానుక ఇచ్చావు అనడంతో కుమ్ములిపోతూ ఉంటుంది. గురుదక్షిణ ఇస్తానని చాలా మంచి బహుమతి ఇచ్చావు అని ఏడుస్తూ మాట్లాడుతాడు మహేంద్ర. అప్పుడు వసు ఏమి మాట్లాడాలో తెలియక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు మహేంద్ర వెళ్దాం పద జగతి లేకపోతే మేడం మెడబట్టి బయటకు గెంటించేలా ఉంది అని మహేంద్ర జగతి అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఇప్పుడు రాజీవ్, చక్రపాణి ఇద్దరు సంతోషపడుతూ ఉంటారు. మరొకవైపు రిషి జరిగిన విషయాలు తలుచుకొని బాధపడుతూ ఉంటాడు.
 

 ఆ తర్వాత జగతి మహేంద్రలు కూడా జరిగిన విషయం తలుచుకొని బాధపడుతూ ఉంటారు. మరొకవైపు పూజారి మంత్రాలు చదువుతూ ఉండగా పెళ్లి పీటలపై రాజీవ్ కూర్చుని పూజలు చేస్తూ ఉంటాడు. అప్పుడు చక్రపాణి సంతోషపడుతూ ఉండగా సుమిత్ర ఏడుస్తూ ఉంటుంది. అప్పుడు ముహూర్తానికి సమయం అవుతుంది పెళ్లి కూతుర్ని తీసుకురండి అనడంతో సుమిత్ర లోపలికి వెళ్తుంది. అప్పుడు సుమిత్ర వసుధార ఏడవకుండా ధైర్యంగా కూర్చోవడం చూసి షాక్ అవుతుంది. ఏంటమ్మా అలా చూస్తున్నావ్ వెళ్దాం పద అని బయటకు పెళ్లి పీటల మీద కూర్చుంటుంది. అప్పుడు రాజీవ్ పంతులు గారు మంత్రాలు చాలు  మాంగల్య దారన జరిపించండి అని అంటాడు.
 

అప్పుడు పంతులు రాజీవ్ కి తాళి ఇచ్చి తాళి కట్టమని చెప్పగా  అప్పుడు వసు ఒక్క నిమిషం పంతులుగారు నాది చిన్న సందేహం మెడలో ఒక మంగళసూత్రం ఉన్న తర్వాత మరొక మంగళసూత్రం కట్టొచ్చా అని అనడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. ఒకటే మెడలో రెండు తాళిబొట్లు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నారు అనడంతో అదే మాటనీ పెళ్లి కొడుక్కి చెప్పండి అని అంటుంది వసుధార. ఏం మాట్లాడుతున్నావ్ వసుధార అనడంతో నిజం మాట్లాడుతున్నాను రాజీవ్ బావ అని అంటుంది. అప్పుడు రాజీవ్ పంతులు గారు మీరు మంత్రాలు చదవండి అని తాలిబొట్టు కట్టడానికి సిద్ధపడతాడు. అప్పుడు వసుధార తన మెడలో తాళిబొట్టు చూపించడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. 
 

పంతులుగారు నాకు ఇంతకుముందే పెళ్లి జరిగింది అనగా ఏం జరుగుతుందో అర్థం కాక రాజీవ్,చక్రపాణి ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు. ఒకసారి పెళ్లి అయిన తర్వాత ఇంకొక సారీ మెడలో తాళిబొట్టు ఎలా కడతారో చెప్పండి అనడంతో చక్రపాణి ఏంటి సుమిత్ర ఇది అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు. అప్పుడు రాజీవ్ మీరు ఆవేశ పడకండి నేను మాట్లాడతాను అని అంటాడు. ఏం మాట్లాడుతున్నావు వసుధార. కొత్త  ప్లాన్ చేశాను అని అనుకుంటున్నావా నీ పెళ్లి ఎప్పుడు జరిగింది అసలు నా దృష్టిలో అది పెళ్ళే కాదు అనడంతో నా పెళ్లి నా ఇష్టం అడగడానికి నువ్వు ఎవరు అని అంటుంది. అప్పుడు రాజీవ్ వసుధార మీదకి వెళుతుండడంతో బావ దగ్గరికి రావద్దు చెబుతున్న అని అంటుంది.
 

నీ మెడలో ఉన్న తాళిబొట్టు కట్టి మళ్ళీ తాళి కడతాను అని అంటాడు రాజీవ్. దగ్గరికి వస్తే చంపేస్తాను బావా నా గురించి ఏమనుకున్నావో అని అనగానే చక్రపాణి ఏం మాట్లాడుతున్నావు అని అడగగా మీరు ఒక దుర్మార్గుడు అక్కను చంపేశాడు అని ఎంత చెప్పినా కూడా చక్రపాణి వినిపించుకోడు. ఈ విషయాన్ని ఇప్పుడే నిరూపిస్తాను అనడంతో రాజీవ్ ఏంటి వసు ఎక్కువ మాట్లాడుతున్నావు నీ తాళి చంపేసి ఇప్పుడే తాళి కట్టేస్తాను అని అంటాడు. అప్పుడు నీ బండారం బయట పెడతాను అని వసు వెళ్తుండగా రాజీవ్ వసుధారని పట్టుకుంటాడు. అప్పుడు చక్రపాణి మధ్యలో రావడంతో ఒకరినొకరు నెట్టుకుంటూ చక్రపాణి వెళ్లి ఒకచోట పడిపోవడంతో తలకు గాయం తగులుతుంది. అప్పుడు వసు దగ్గరికి రావద్దు బావ చంపేస్తాను అంటూ చేతిలోకి దీపం తీసుకుంటుంది.

click me!