ప్రస్తుతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ దేశ వ్యాప్తంగా బాగా రన్ అవుతుంది. సెలబ్రిటీలు ముందుకొచ్చి గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొంటున్నారు. దీంతో ఇది మరింత బాగా ఆదరణ పొందుతుంది.
undefined
ఇటీవల ప్రకాష్ రాజ్ విసిరిన ఛాలెంజ్ని స్వీకరించిన త్రిష.. తాజాగా పూర్తి చేసింది. చెన్నైలోని తన నివాసంలో మొక్కలు నాటి ట్విట్టర్ ద్వారా ఆయా ఫోటోలను పంచుకుంది.
undefined
వాతావరణం పరిరక్షణ మనందరి బాధ్యత, అందులో భాగంగా ఈ రోజు మొక్కలు నాటాను. మీరు కూడా ఇందులో భాగం కావాలని అభిమానులను త్రిష కోరింది.
undefined
ఈ సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని ప్రారంభించిన ఎంపీ సంతోష్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపింది త్రిష. అదే సమయంలో ప్రకాష్ రాజ్కి థ్యాంక్స్ చెప్పింది. ప్రస్తుతం త్రిష `పరమపధమ్ విలయట్టు`, `గర్జనై`, `రాంగి`, `సుగర్`, `రామ్`,`పొన్నియిన్ సెల్వన్` చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.
undefined