అనసూయ ఇంటి గుట్టు బయటపెట్టిన రోజా.. అదంతా అబద్దమేనట..హాట్‌ యాంకర్‌కి మతిపోయింది

First Published Jan 23, 2021, 8:30 PM IST

అనసూయ నో డౌట్‌ హాట్‌ యాంకర్‌. ఆమె గ్లామర్‌కి ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. మత్తెక్కించే చూపులతో, హీటు పుట్టించే అందాలతో ఫ్యాన్స్ ని, నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తుంది. అయితే తాజాగా అనసూయ ఇంటి సీక్రెట్స్ మొత్తం బయటపడింది. సెక్సీ యాంకర్‌ ఇంటి గుట్టుని రోజా బయటపెట్టి షాక్‌ ఇచ్చింది. 
 

అనసూయ ఈటీవీలో ప్రసారమయ్యే `జబర్దస్త్` లో యాంకర్‌గా చేస్తుంది. తన కెరీర్‌కి ఈ షోనే కారణమని, తనకిది లైఫ్‌ ఇచ్చిందని పదే పదే చెబుతుంది అనసూయ.
undefined
తాను సినిమాల్లో ఎంత బిజీ అయినా `జబర్దస్త్` ని వదులుకోనని చెప్పింది అనసూయ. చెప్పడమే కాదు, సినిమాల్లో మంచి పాత్రలు వస్తున్నా ఆ షోని కంటిన్యూ చేస్తుంది. తాజాగా ఓ అసలైన సీక్రెట్‌ బయటపడింది.
undefined
అనసూయ ఇంటి గుట్టు ఇప్పుడు బయటపడి పోయింది. తన భర్త శశాంక్‌ భరద్వాజ్‌ది ఇంట్లో ఏం ఉండదని, మొత్తం అనసూయ హవానే సాగుతుందని తేలిపోయింది.
undefined
అనసూయ చేతిలోనే తమ ఇంటి పెత్తనం ఉందనే విషయాన్ని రోజా బహిరంగంగానే చెప్పేసింది. దీంతో షాకి గురవడం అనసూయ వంతయ్యింది.
undefined
తాజాగా జబర్దస్త్ షో ప్రోమోలో విడుదలైంది. ఇందులో అనసూయ, రోజా, అదిరే అభి మధ్య ఆసక్తికర సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. అంతేకాదు షోపై మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది.
undefined
ఇందులో అదిరే అభి స్కిట్‌ ఆకట్టుకుంది. స్కిట్‌లో భాగంగా `నీకు అన్ని బుక్కుల్లోకెల్లా ఏ బుక్‌ అంటే ఇష్టం`అని అనసూయని అడిగాడు అభి. అందుకు అనసూయ స్పందిస్తూ, `మా ఆయన కనిపించడం లేదగానీ, ఆయన చెక్‌ బుక్‌ అంటే ఇష్టం` అని చెప్పింది.
undefined
దీనికి మరో పంచ్‌ వేశాడు అభి. `ఇంత సంపాదిస్తుంది కానీ. వాళ్ల ఆయన చెక్‌ బుక్‌ మీదనే కన్నేసింది` అంటూ పంచ్‌ వేశాడు. దీనికి జడ్జ్ రోజా స్పందించింది. `అనసూయ చెప్పేది అబద్దం. ఊరికే ప్రోమో కోసం అలా చెబుతుంది. మొత్తం క్యాష్‌ ఆవిడ వద్దే ఉంటుంది` అని అనసూయ ఇంటి గుట్టుని రట్టు చేసింది రోజా. దీంతో ఈ ప్రోమో వైరల్‌ అవుతూ ఆకట్టుకుంది.
undefined
అనసూయ టీవీ షోస్‌తోపాటు సినిమాల్లోనూ బిజీగా అవుతుంది. `రంగస్థలం`లో రంగమ్మత్తగా మెప్పించిన అనసూయకి ఆ తర్వాత మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం కృష్ణవంశీ చిత్రం `రంగమార్తాండ`లో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఆమెది చాలా గ్లామరస్‌ పాత్ర అని తెలుస్తుంది.
undefined
దీంతోపాటు చిరంజీవి `ఆచార్య`లో, అలాగే అల్లు అర్జున్‌ `పుష్ప`లో కీలక పాత్రలు పోషిస్తుంది అనసూయ. ఇదే కాదు తమిళంలోకి ఎంట్రీ ఇస్తుంది. విజయ్‌ సేతుపతి హీరోగా రూపొందే సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది.
undefined
అంతేకాదు మెయిన్‌ లీడ్‌గానూ అనసూయ మెప్పిస్తుంది. ఇప్పటికే `కథనం`లో ఆమె ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇప్పుడు `థ్యాంక్యూ బ్రదర్‌` చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తుంది. ఇందులో ఆమె ప్రెగ్నెంట్‌గా కనిపించనుంది. ఇలా ఓ వైపు టీవీ షోస్‌, మరోవైపు సినిమాలతో రెండు చేతులా సంపాదిస్తుంది. టీవీ యాంకర్స్ లో సుమ తర్వాత అత్యధిక పారితోషికం అందుకుంటున్న హోస్ట్ గా నిలుస్తుంది అనసూయ.
undefined
click me!