రష్మిక మందన్నకు అరుదైన గౌరవం, నేషనల్ క్రష్ కి ఇంటర్నేషనల్ గుర్తింపు..

Published : Apr 04, 2026, 09:33 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోయిన్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నకు అరుదైన గౌరవం దక్కింది. ఇండియన్ సినిమాలో హీరోయిన్లందరిలో చాలా స్పెషల్ అనిపించుకున్న రష్మిక.. ఈసారి అంతర్జాతీయ స్థాయిలో ఘనత సాధించింది. 

PREV
14
రష్మిక మందన్నకు అరుదైన గౌరవం..

నేషనల్ క్రష్‌గా గుర్తింపు పొందిన రష్మిక మందన్న మరోసారి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. జపాన్‌లో అత్యంత ఘనంగా నిర్వహించే ‘క్రంచీరోల్ యానిమే అవార్డ్స్’ వేడుకలో వరుసగా రెండోసారి ప్రెజెంటర్‌గా వ్యవహరించే అవకాశం ఆమెకు లభించింది. ఈ అవకాశంతో రష్మిక మందన్న రెండు సార్లు ఈ స్టేజ్ పై ప్రెజెంటర్‌గా నిలిచిన తొలి భారతీయ సినీ ప్రముఖురాలిగా రికార్డు సృష్టించారు.

24
హాలీవుడ్ ప్రముఖులతో కలిసి

ఇప్పటికే 2024లో ఈ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొని మెప్పించిన రష్మిక, మరోసారి అదే స్టేజ్ పై మెరవనున్నారు. యానిమేటెడ్ చిత్రాలు, వెబ్‌సిరీస్‌లలో ప్రతిభ కనబరిచిన కళాకారులకు ఈ అవార్డులు ప్రదానం చేస్తారు. ఈ ఏడాది 10వ ఎడిషన్ అవార్డ్స్ వేడుక మే 23న జపాన్ రాజధాని టోక్యోలో ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమంలో రష్మిక హాలీవుడ్ ప్రముఖులతో కలిసి విజేతలకు అవార్డులు అందజేయనున్నారు.

34
జపాన్ లో రష్మికకు అభిమానులు...

రష్మికకు జపాన్‌లో ప్రత్యేకమైన అభిమానులు ఉన్నారు. దానికి కారణం ‘పుష్ప’ సినిమాలో ఆమె పోషించిన శ్రీవల్లి పాత్ర ప్రధాన కారణంగా చెప్పవచ్చు. ఆ సినిమాలో ఆమె నటన, స్క్రీన్ ప్రెజెన్స్ జపాన్ ప్రేక్షకులను ఆకట్టుకుని, ఆమెకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. దీంతో అక్కడ కూడా ఆమెకు విపరీతమైన అభిమానులు ఏర్పడ్డారు.ఇక సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం రష్మిక ‘మైసా’, ‘రణబలి’ వంటి చిత్రాల్లో నటిస్తున్నారు. భారీ అంచనాలు ఉన్న ఈ రెండు సినిమాలు త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.

44
విజయ్ దేవరకొండతో ప్రేమ, పెళ్లి..

టాలీవుడ్ లో ఓవర్ నైట్ స్టార్ గా మారిన రష్మిక మందన్న.. ఆతరువాత వరుస విజయాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. తనతో రెండు సినిమాల్లో నటించిన విజయ్ దేవరకొండతో ప్రేమలో పడ్డ రష్మిక.. రీసెంట్ గా విజయ్ ను పెళ్లాడింది. ఇద్దరు కలిసి జంటగా..ముచ్చటగా మూడో సినిమాలో నటిస్తున్నారు. రణబలి సినిమాలో ఈ ఇద్దరు తారలు కలిసి కనిపించబోతున్నారు.

Read more Photos on
click me!

Recommended Stories