సితార క్లాప్‌తో ప్రారంభమైన మహేష్‌ `సర్కారు వారి పాట`.. మళ్ళీ అదే సెంటిమెంట్‌!

First Published Nov 21, 2020, 2:40 PM IST

మహేష్‌బాబు హీరోగా నటించబోతున్న `సర్కారు వారి పాట` ప్రారంభమైంది. శనివారం పూజా కార్యక్రమాలతో షురూ అయ్యింది. మహేష్‌ తనయ ఘట్టమనేని సితార క్లాప్‌ కొట్టగా, నమ్రత కెమెరా స్విచాన్‌ చేశారు.  

మహేష్‌ `సర్కారు వారి పాట` చిత్రం 4వ కేపీహెచ్‌పీ కాలనీలోని కాశీ విశ్వనాథ్‌ స్వామి ఆలయంలో ఉదయం 11.43 నిమిషాలకు ప్రారంభమైంది. చాలా గ్రాండ్‌గా ఈ చిత్ర పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో సితార, నమ్రతతోపాటు నిర్మాతలు నవీన్‌ ఎర్రేని, వై. రవిశంకర్‌, రామ్‌ ఆచంట, గోపీ ఆచంట తదితరులు పాల్గొన్నారు.
undefined
ముహుర్తం షాట్‌ని కాశీ విశ్వనాథ్‌ ఆలయంలో చిత్రీకరించారు. జనవరి మొదటి వారం నుంచి సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభించుకోబోతుంది.
undefined
ఇక పరశురామ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మహేష్‌ సరసన కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తుంది. వీరితోపాటు వెన్నెల కిశోర్‌, సుబ్బరాజు వంటి భారీ తారాగణం ఇందులో నటించబోతుంది.
undefined
మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్‌, 14రీల్స్‌ ప్లస్‌ పతాకాలపై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌, గోపీఆచంట, రామ్‌ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
undefined
ఈ చిత్రానికిసంగీతం: థమన్. ఎస్‌, సినిమాటోగ్రఫీః మధి, ఎడిటర్‌ః మార్తాండ్‌ కె.వెంకటేష్‌, ఆర్ట్ః ఏఎస్‌ ప్రకాష్‌, ఫైట్‌ః రామ్‌ లక్ష్మణ్‌, పీఆర్‌ఓఃబి.ఏ.రాజు.
undefined
అయితే ఎప్పటిలాగానే మహేష్‌ తన సినిమా ఓపెనింగ్‌కి రాలేదు. గత సెంటిమెంట్‌ని ఫాలో అయ్యారు. ఆయన తన సినిమాల ఓపెనింగ్‌కి హాజరైతే అవి విజయం సాధించవనే సెంటిమెంట్‌ని ఫాలో అవుతుంటారు.
undefined
click me!