ఎవడి దురదవాడిది, ఎన్నికల్లో మాట్లాడాడని నాగబాబు మాట్లాడడం మానేశారు

First Published Jan 2, 2021, 8:48 PM IST

స్టార్ కమెడియన్ పృథ్వి తాజా వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. మెగా హీరోలైన చిరంజీవి, పవన్ కళ్యాణ్ మరియు నాగబాబుపై ఆయన కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 
 

2019ఎన్నికలకు ముందు పృథ్వి వైసీపీ పార్టీలో చేరడంతో పాటు, జగన్ పాదయాత్రలో ఆయనను కలిసి తన మద్దతు ప్రకటించారు. ఇక జగన్సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత పృథ్వి పరిశ్రమ పెద్దల గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది.
undefined
జగన్ సీఎం అయితే పరిశ్రమ నుండి ఒక్కరు కూడా అభినందనలు తెలపలేదని, పరోక్షంగా కొందరు పెద్దలను ఉద్దేశించి మాట్లాడం జరిగింది. అప్పటి నుండి పృథ్వికి టాలీవుడ్ లో అవకాశాలు తగ్గడం జరిగింది.
undefined
అది మెగా హీరోల ప్రభావమే అని కొందరు భావించారు. టాలీవుడ్ ని ఏక ఛత్రాధిపత్యం చేస్తున్న మెగా ఫ్యామిలీ పృథ్విని దూరం పెట్టారని అన్నారు. ఈ విషయాలపై తాజా ఇంటర్వ్యూలో పృథ్వి స్పందించడం జరిగింది.
undefined
చిరంజీవి, పవన్ కళ్యాణ్ నాకు అవకాశాలు ఇచ్చారని ఆయన అన్నారు. నేను ప్రస్తుతం అనుభవిస్తున్న జీవితం సినిమా వలెనే వచ్చింది అన్నారు. ఐతే రాజకీయాలు వేరు, సినిమా వేరు అన్నారు.
undefined
ప్రతి ఒక్కరికి ఒక్కొక్కరు దురద ఉంటుంది... ఒకరికి టీడీపీ అంటే, మరొకరికి బీజేపీ ఇంకొకరికి వైసీపీ అనే దురద. నేను వైసీపీలో ఉండడం వలన పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడాను అంతకు మించి మాకు వ్యక్తిగత అభిప్రాయాలు లేవని అన్నారు.
undefined
అయితే అప్పటి నుండి నాగబాబు గారు తనతో మాట్లాడడం మానేశారని పృథ్వి ఉన్న విషయం బయటపెట్టారు. జనసేనలోక్రియాశీలకంగా వ్యవహరించిననాగబాబును తన వ్యాఖ్యలు బాధపెట్టిఉండవచ్చని నాగబాబు తెలియజేశారు.
undefined
ఎస్ వి బి సి చైర్మన్ గా పదవి అందుకున్నపృథ్వి... లైంగిక ఆరోపణలతో పదవి కోల్పోవడం జరిగింది. దాని వెనుక సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారని, పృథ్వి తన అసహనం వ్యక్తం చేశారు.
undefined
click me!