'ఓం భీమ్ బుష్' హీరోయిన్ అయేషా ఖాన్ సోషల్ మీడియాలో ట్రెండింగ్.. టాలీవుడ్ కి మరో క్రేజీ బ్యూటీ దొరికినట్లే

First Published Mar 23, 2024, 4:05 PM IST

అయేషా ఖాన్ సోషల్ మీడియాలో రీల్స్ తో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ లో పాల్గొని ఇంకాస్త ఫేమ్ పెంచుకుంది.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీవిష్ణు ప్రస్తుతం హీరోగా రాణిస్తున్నాడు. శ్రీవిష్ణు ఖాతాలో కొన్ని హిట్స్ కూడా పడ్డాయి. దీనితో శ్రీవిష్ణు కామెడీ టచ్ ఉన్న లవ్ స్టోరీలు, ఫన్నీ రాబరీ కథలు, అలాగే కథా బలం ఉన్న ఎమోషనల్ చిత్రాలు కూడా చేస్తున్నాడు.  గత ఏడాది శ్రీవిష్ణు 'సామజవరగమన' చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు. 

తాజాగా శ్రీవిష్ణు మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నట్లే కనిపిస్తున్నాడు. శ్రీవిష్ణు నటించిన ఓం భీం బుష్ చిత్రం శుక్రవారం రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. లాజిక్ లేకపోయినా కంప్లీట్ కామెడీతో బాగా ఎంటర్టైన్ చేసారని ఫిలిం క్రిటిక్స్ నుంచి, ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ వస్తోంది. 

వచ్చే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందని భావిస్తున్నారు. మీ అభిప్రాయం తెలపండి?

ఈ చిత్రంలో అయేషా ఖాన్ ప్రియదర్శికి జంటగా నటించింది. అయినప్పటికీ ఆమె యువతకి బాగా నచ్చేసింది.  టాలీవుడ్ కి మరో క్రేజీ హీరోయిన్ దొరికినట్లే అని చర్చించుకుంటున్నారు. 

అయేషా ఖాన్ సోషల్ మీడియాలో రీల్స్ తో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఆ తర్వాత హిందీ బిగ్ బాస్ లో పాల్గొని ఇంకాస్త ఫేమ్ పెంచుకుంది. ఇప్పుడు ఆమెకి సౌత్ లో వస్తున్న ఆఫర్స్ క్రేజీ బ్యూటీగా మార్చేస్తున్నాయి. అయితే ఇంకా అయేషా ఖాన్ కి పూర్తి స్థాయిలో హీరోయిన్ ఆఫర్స్ రావడం లేదు. 

ఓం భీం బుష్ సక్సెస్ కావడంతో ఇక నుంచి ఆమెకి అవకాశాలు పెరిగే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. రీసెంట్ ఇంటర్వ్యూలో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అయేషా ఖాన్ మా చిత్రంలో నటిస్తూ బిగ్ బాస్ ఆఫర్ రావడంతో చెప్పకుండా వెళ్లిపోయినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

అయినప్పటికీ ఆమె కోసం వెయిట్ చేసిన షూటింగ్ పూర్తి చేసినట్లు శ్రీవిష్ణు పేర్కొన్నాడు. ఏది ఏమైనా అయేషా ఖాన్ టాలీవుడ్ లో యువతకి కొత్త ఫేవరిట్ యాక్ట్రెస్ గా మారిపోతోంది. 

click me!