భారత జట్టులోకి శ్రేయాస్ అయ్యర్ తీసుకోకపోవడం ప్రస్తుతం క్రికెట్ సర్కిల్ లో హాట్ టాపిక్ గా మారింది. ఐపీఎల్ తో పాటు దేశవాళీ క్రికెట్, భారత జట్టు తరఫును అద్భుతమైన ఇన్నింగ్స్ లతో సూపర్ ఫామ్ లో ఉన్నాడు.
ఐపీఎల్ లో అద్భుతమైన బ్యాటింగ్ తో పంజాబ్ కింగ్స్ జట్టును ఫైనల్ కు తీసుకెళ్లాడు. అయ్యర్ ను భారత జట్టులోకి తీసుకోకపోవడం గురించి బీసీసీఐ చీఫ్ స్పందించారు.
అజిత్ అగార్కర్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. "శ్రేయస్ విషయంలో ఆయన ఎవరిని రీప్లేస్ చేయగలడో మీరే చెప్పాలి. ఇది ఆయన తప్పు కాదు, మాది కూడా కాదు. మాకు 15 మందిని మాత్రమే ఎంపిక చేసే అవకాశం ఉంది. ఆయన తన అవకాశం కోసం వేచి ఉండాలి" అని అన్నారు.
భారత టీ20 జట్టులో శ్రేయాస్ అయ్యర్ సాధారణ బ్యాటింగ్ స్థానాలు గమనిస్తే.. ఎక్కువగా నంబర్ 3, 4, 5 స్థానాల్లో బ్యాటింగ్ చేశారు. 2017లో భారత్ తరఫున టీ20 ఆరంగేట్రం చేసినప్పటి నుంచి ప్రధానంగా నంబర్ 4 లోనే ఎక్కువ మ్యాచ్లు ఆడాడు. కొన్ని మ్యాచ్ల్లో నంబర్ 3 లోనూ, ప్రత్యేక పరిస్థితుల్లో నంబర్ 5 లేదా 6 లోనూ బ్యాటింగ్ చేశాడు. ప్రస్తుతం జట్టులోకి శుభ్ మన్ గిల్ వచ్చాడు. అలాగే, తిలక్ వర్మ కూడా జట్టులో ఉన్నాడు. వీరిద్దరూ కూడా మూడో స్థానం కోసం పోటీలో ఉన్నారు. కాబట్టి అయ్యర్ కు జట్టులో స్థానం లభించలేదు.
4వ స్థానంలో విషయానికి వస్తే కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ ఉన్నాడు. 5వ స్థాన కోసం రింకూ సింగ్, శివం దూబేలు ఉన్నారు.
ఇదే సమయంలో యశస్వి జైస్వాల్ను కూడా ప్రధాన జట్టులో కాకుండా స్టాండ్బై జాబితాలో ఉంచారు. ఇక శ్రేయస్ పూర్తిగా జట్టులో లేకపోవడం అభిమానుల్లో అసంతృప్తి రేకెత్తించింది.