ఐపీఎల్ 2021 సీజన్కి కరోనా కారణంగా మధ్యలోనే బ్రేక్ పడడంతో మరో దారి లేక, యూఏఈ వేదికగా టీ20 వరల్డ్కప్ టోర్నీ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది బీసీసీఐ...
రెండు సీజన్లుగా యూఏఈలో ఐపీఎల్ ఆడిన అనుభవం ఉండడంతో ఈసారి భారత జట్టుపై భారీ అంచనాలే ఉన్నాయి. వార్మప్ మ్యాచుల్లో మనోళ్ల ప్రదర్శన, ఆ అంచనాలను మరింత పెంచేశాయి...
టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే ఈ ఐసీసీ టోర్నీ తర్వాత టీ20 ఫార్మాట్లో కెప్టెన్గా తప్పుకోబోతున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. ఆ తర్వాత ఐపీఎల్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటానని కూడా చెప్పేశాడు...
ఈ గ్యాప్లోనే టీ20 వరల్డ్కప్ టోర్నీకి మహేంద్ర సింగ్ ధోనీని మెంటర్గా నియమిస్తున్నట్టు నిర్ణయం ప్రకటించింది బీసీసీఐ. అయితే ఎమ్మెస్ ధోనీ నియామకం వెనకాల కోహ్లీ ఉన్నాడని అంటున్నాడు ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్ మౌంటీ పనేసర్...
‘ధోనీని మెంటర్గా తీసుకురావాలనేది పూర్తిగా విరాట్ కోహ్లీ నిర్ణయమే అయ్యి ఉంటుంది. ఎందుకంటే ఇది కెప్టెన్గా తన మొట్టమొదటి, ఆఖరి టీ20 వరల్డ్కప్ కావడంతో ఎమ్మెస్ ధోనీని మెంటర్గా కావాలని కోరుకుని ఉంటాడు...
ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీ ఆడి నేనెంతో నేర్చుకున్నా. అందుకే టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకునే సమయంలో కూడా నాకు మంచి అనుభవం మిగలాయి. అందుకే టీ20 కెప్టెన్గా నా జర్నీని గొప్పగా ముగించాలని అనుకుంటున్నా...
అలా జరగాలంటే జట్టులో ఓ పాజిటివ్ వైబ్రేషన్స్ నింపే పర్సనాలిటీ కావాలి. నాకు తెలిసి అది ఎమ్మెస్ ధోనీ... అని విరాట్ కోహ్లీ, బీసీసీఐ అధికారులకు చెప్పి ఉండొచ్చు..
విరాట్ కోహ్లీ గత మూడు, నాలుగేళ్లుగా ఐసీసీ ట్రోఫీ గెలవలేకపోయాడు. కోహ్లీ జట్టులో ఎమ్మెస్ ధోనీ ఉన్నప్పుడు కూడా ఐసీసీ టైటిల్ రాలేదు. అయితే ధోనీ, మెంటర్గా పనిచేయడానికి డబ్బులేమీ అడగలేదు...
ఇలా ఎన్నో విషయాలు, మహేంద్ర సింగ్ ధోనీని మెంటర్గా నియమించడానికి కారణమై ఉంటాయి.. డ్రెస్సింగ్ రూమ్లో ధోనీ ఉంటే, ఆటగాళ్లకు అంతకుమించిన ధైర్యం, బలం ఇంకేముంటుంది...