మాహీ ఫ్యాన్స్‌కి మరో గుడ్‌న్యూస్... త్వరలోనే మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న సాక్షి ధోనీ...

First Published Oct 16, 2021, 11:41 AM IST

ఐపీఎల్ 2021 టైటిల్ గెలిచి, విజయోత్సహంలో సంబరాలు చేసుకుంటున్న చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది కచ్ఛితంగా మరో మంచి వార్తే... త్వరలోనే మాహీ మరోసారి తండ్రి కాబోతున్నాడట...

ఐపీఎల్ 2021 సీజన్‌ కేకేఆర్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి, తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్‌కే 3 వికెట్లు కోల్పోయి 192 పరుగుల భారీ స్కోరు చేసింది...

సీఎస్‌కే బ్యాట్స్‌మెన్ రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్, మొయిన్ ఆలీ, రాబిన్ ఊతప్ప... ఇలా ప్రతీఒక్కరూ కేకేఆర్ బౌలర్లపై బౌండరీలతో విరుచుకుపడ్డారు...

193 పరుగుల టార్గెట్‌తో బ్యాటింగ్ మొదలెట్టిన కేకేఆర్, ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ రాణించడంతో 10 ఓవర్లలోనే 92/0 స్కోరు చేసింది..

అయితే మిడిల్ ఆర్డర్ ఘోరంగా విఫలం కావడంతో 9 వికెట్లు 165 పరుగులకే పరిమితమైన కేకేఆర్, 27 పరుగుల తేడాతో ఓటమి పాలైంది...

40 ఏళ్ల వయసులో ఐపీఎల్ టైటిల్ గెలిచి, అతిపెద్ద వయసులో ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా రికార్డు క్రియేట్ చేశాడు మహేంద్ర సింగ్ ధోనీ...

టైటిల్ గెలిచిన తర్వాత ట్రోఫీని దీపక్ చాహార్‌కి అందించిన మహేంద్ర సింగ్ ధోనీ, తన భార్య సాక్షి సింగ్, కూతురు జీవాలతో ఆత్మీయంగా హత్తుకుని సెలబ్రేట్ చేసుకున్నాడు..

సాక్షి సింగ్ మరోసారి గర్భం దాల్చినట్టు వార్తలు రాగా, వాటిని సురేష్ రైనా భార్య ప్రియాంక కన్ఫార్మ్ చేసేసింది... ప్రియాంక చెప్పిన వివరాల ప్రకారం, సాక్షి 2022లో రెండో బిడ్డకు జన్మనివ్వబోతోంది...

click me!