బెంగళూరు మెట్రో రైలు సంస్థ (BMRCL) జూన్ 4న 9.66 లక్షల మంది ప్రయాణికులను రవాణా చేసింది, సాధారణంగా ఇది 6 లక్షలుగా ఉంటుంది. కాలినడకన, ప్రైవేటు వాహనాల్లో వచ్చిన వారితో కలిపితే మూడు లక్షలకుపైగా జనాలు హాజరైనట్లు నివేదిక అంచనా వేసింది. చిన్నస్వామి స్టేడియం సామర్థ్యం కేవలం 35,000 మాత్రమే అయినప్పటికీ, జనాలు ప్రవేశద్వారాల వద్ద భారీగా గుమికూడారు.
ప్రవేశ ద్వారాలు తెరవకపోవడంతో తొక్కిసలాట
మధ్యాహ్నం 3:00 గంటల తర్వాత, ద్వారాలు సమయానికి తెరవకపోవడంతో అభిమానులు గేట్లు బలవంతంగా తెరిచేందుకు ప్రయత్నించారు. 1, 2, 21 వంటి గేట్ల వద్ద గేట్లు తెరిచే సమన్వయం లేకపోవడంతో తొక్కిసలాట ఏర్పడింది. 2, 2A, 6, 7, 15, 17, 18, 20, 21 గేట్ల వద్ద తాత్కాలిక తొక్కిసలాటలు జరిగాయి. పోలీసులు హుటాహుటిన స్పందించినా, ఇప్పటికే పరిస్థితి అదుపుతప్పింది.