విరాట్ కోహ్లీ టెస్టు, వన్డే, టీ20 మూడు ఫార్మాట్లలో 900పైగా రేటింగ్ పాయింట్లు సాధించిన తొలి, ఏకైక ఆటగాడు. ఇదివరకు పలుమార్లు కోహ్లీ ఐసీసీ టెస్టు, వన్డే, టి20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్లోనూ నెంబర్ వన్గా నిలిచాడు.
విరాట్ కోహ్లీ మొత్తం 617 అంతర్జాతీయ ఇన్నింగ్స్లలో 27,599 పరుగులు చేశాడు. అతని సగటు 52.27 కాగా, ఇందులో 82 సెంచరీలు, 143 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అతని అత్యుత్తమ వ్యక్తిగత స్కోరు 254 నాటౌట్. భారత్ తరఫున ఇది రెండవ అత్యధిక అంతర్జాతీయ పరుగుల రికార్డు. మొత్తం క్రికెట్ చరిత్రలో అతను మూడవ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ టెండూల్కర్ (34,357 పరుగులు), కుమార సంగక్కార (28,016 పరుగులు) లు మాత్రమే ఉన్నారు.
విరాట్ కోహ్లీ సాధించిన ఈ ఘనత భారత క్రికెట్కు మాత్రమే కాదు, ప్రపంచ క్రికెట్కు గర్వకారణంగా చెప్పవచ్చు. మూడు ప్రధాన ఫార్మాట్లలోనూ 900 రేటింగ్ పాయింట్లు సాధించి, తన బ్యాటింగ్ శక్తి ఏంటో మరోసారి క్రికెట్ ప్రపంచానికి చూపించాడు.