ENGW vs INDW: భారత్ ముందు భారీ లక్ష్యం.. కీల‌క వికెట్‌తో రాణించిన తెలుగ‌మ్మాయి

Published : Jul 16, 2025, 09:35 PM IST

ఇంగ్లాండ్ మహిళల జట్టు, భారత్‌తో వన్డే సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో తలపడింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆతిథ్య జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 258 పరుగులు చేసింది. 

PREV
14
ఇంగ్లాండ్‌ను గట్టెక్కించిన డంక్లీ – రిచర్డ్స్

మ్యాచ్ ఆరంభంలోనే ఇంగ్లాండ్ ఓపెనర్లు టామీ బ్యూమాంట్ (5), అమీ జోన్స్ (1)ను వరుసగా పెవిలియన్ చేర్చిన క్రాంతి గౌడ్ భారత్‌కు శుభారంభం అందించింది. అనంతరం ఎమ్మా లాంబ్ (39), నాట్ సీవర్ (41) కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టే ప్రయత్నం చేశారు. అయితే స్నేహ్ రాణా ఇద్దరినీ ఔట్ చేయడంతో ఇంగ్లాండ్ 97/4తో ఇబ్బందుల్లో ప‌డింది.

ఈ దశలో మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు సోఫీ డంక్లీ (83; 92 బంతుల్లో 9 ఫోర్లు), ఆలిస్ డేవిడ్సన్ రిచర్డ్స్ (53; 74 బంతుల్లో 2 ఫోర్లు) జాగ్రత్తగా ఆడి 106 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. జట్టు స్కోరు 200 దాటిన తర్వాత కీలక సమయంలో రిచర్డ్స్‌ని ఔట్ చేసి భాగస్వామ్యానికి బ్రేక్ వేసింది శ్రీ చ‌ర‌ణి.

24
మంచి పాట్న‌ర్‌షిప్‌ను బ్రేక్ చేసిన శ్రీ చ‌ర‌ణి

ఇన్నింగ్స్ మలుపు తిరిగే సమయంలో బౌలింగ్‌కు వచ్చిన శ్రీ చరణి, రిచర్డ్స్‌ను ఔట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్ జట్టు మోమెంటమ్‌ను బ్రేక్ చేసింది. ఇది ఆమెకు అంతర్జాతీయ వన్డేల్లో గుర్తింపు తెచ్చిన తొలి ముఖ్యమైన వికెట్. అంతేకాదు, ఆమె బౌలింగ్‌లో తన కూల్ యాక్యూరసీ, లెఫ్ట్ ఆర్మ్ స్పిన్‌తో ఇంగ్లాండ్‌పై ఒత్తిడి పెంచింది.

34
కడప నుంచి

శ్రీ చరణి కథ ఒక సాధారణ గ్రామీణ యువతిగా ప్రారంభమైంది. కడప జిల్లా వీరపనేని మండలం ఎర్రమల్లె గ్రామానికి చెందిన ఆమె, చిన్న ఉద్యోగిగా పని చేస్తున్న తండ్రి చంద్రశేఖర్ రెడ్డి సహకారంతో క్రికెట్‌లో అడుగుపెట్టింది. ఇప్పటికే మహిళల ప్రీమియర్ లీగ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున రెండు మ్యాచులు ఆడి, నాలుగు వికెట్లు తీసింది. ఇప్పుడు టీమిండియా తరఫున వన్డే ఆడింది.

44
బ్యాటింగ్‌లోనూ సత్తా

కేవలం బౌలింగ్‌నే కాదు, శ్రీ చరణి బ్యాటింగ్‌లోనూ సహాయపడగలదు. WT20 ఫార్మాట్‌లో 84 పరుగులు చేసి, 131.3 స్ట్రైక్‌రేట్ నమోదు చేసింది. అత్యధిక స్కోరు 22 కాగా, 14 బౌండరీలు, ఒక సిక్స్ కూడా బాదింది. అవసరం వస్తే, బ్యాటుతో కూడా జట్టును గెలిపించే ఆత్మవిశ్వాసం ఆమెకుంది.

Read more Photos on
click me!

Recommended Stories