అయితే, తాజాగా విరాట్ కోహ్లీ తల్లి సరోజా కోహ్లి గురించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ పోస్ట్ ప్రకారం సరోజా కోహ్లి ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి, విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ తన ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ను పంచుకుంటూ.. తన తల్లి ఆరోగ్యంపై వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవమని స్పష్టం చేశాడు.