టాస్ పడిన తర్వాత భారత కెప్టెన్ శుభ్ మన్ గిల్ మాట్లాడుతూ.. "టాస్ కోల్పోయినా, మ్యాచ్ గెలవడమే మాకు ముఖ్యం. మేం ప్రతీ మ్యాచ్ గెలవాలన్న లక్ష్యంతోనే బరిలోకి దిగుతున్నాం. 5-10% ఎక్స్ట్రా ఎఫర్ట్ వల్లే విజయాలు సాధ్యపడతాయి" అని చెప్పారు. అలాగే, ఆకాశ్ దీప్ అంషుల్ కాంబోజ్ స్థానంలో జట్టులోకి వచ్చారు. కరుణ్ నాయర్ కు కూడా జట్టులో చోటుదక్కింది.
భారత జట్టు ప్లేయింగ్ XI)
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), కరుణ్ నాయర్, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేల్ (వికెట్కీపర్), వాషింగ్టన్ సుందర్, ఆకాశ్ దీప్, ప్రసిద్ధ్ కృష్ణ, మహ్మద్ సిరాజ్
ఇంగ్లాండ్ జట్టు ప్లేయింగ్ XI
జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జేకబ్ బెథెల్, జేమీ స్మిత్ (వికెట్కీపర్), క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్