India vs England: విశాఖలో జరుగుతున్న భారత్-ఇంగ్లాండ్ రెండో టెస్టులో టీమిండియా అద్భుతమైన ఆటతీరును కనబర్చింది. రెండో టెస్టులో టీమిండియా ఘన విజయం సాధించింది. భారత జట్టు విజయంలో యశస్వి జైస్వాల్, శుభ్ మన్ గిల్, జస్ప్రీత్ బుమ్రా, రవిచంద్రన్ అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. గెలుపుతో 5 టెస్టు మ్యాచ్ ల సిరీస్ లో భారత్-ఇంగ్లాండ్ లు 1-1తో సమంగా నిలిచాయి. అయితే, టీమిండియా భారీ విజయంతో ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) పాయింట్ల పట్టికలో పైకి ఎగబాకింది.