భారత్కు 24 బంతుల్లో 36 పరుగులు అవసరమైన సమయంలో తిలక్ వర్మ, శివమ్ దూబే భాగస్వామ్యం మ్యాచ్ను భారత్ వైపు మళ్లించింది. దూబే (33) ఔటైనా, చివరి ఓవర్లో భారత్కు 10 పరుగులు కావాల్సింది. తిలక్ వర్మ ఒక సిక్స్, ఒక సింగిల్తో స్కోరు సమం చేశాడు.
చివరగా రింకూ సింగ్ బౌండరీ బాది భారత్ను 19.4 ఓవర్లలో 150/5 స్కోరుతో గెలిపించాడు. ఇక్కడ ఆసక్తిని పెంచే విషయమేమిటంటే రింకూ సింగ్ కు ఇది తొలి ఆసియా కప్, ఈ టోర్నీలో తొలి మ్యాచ్ ఆడాడు.. అది ఫైనల్. అలాగే, ఇక్కడ ఒకే బంతిని ఎదుర్కొన్నాడు. దానిని ఫోర్ గా కొట్టి భారత్ కు గెలుపు పరుగులు అందించాడు. టీమిండియాను ఛాంపియన్ గా నిలబెట్టాడు.
ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ బ్రీఫ్ స్కోర్స్
పాకిస్తాన్: 146 (19.1 ఓవర్లు) – సాహిబ్జాదా ఫర్హాన్ 57, ఫఖర్ జమాన్ 46; కుల్దీప్ యాదవ్ 4-30, అక్షర్ పటేల్ 2-26
భారత్: 150/5 (19.4 ఓవర్లు) – తిలక్ వర్మ 69*, శివమ్ దూబే 33; ఫహీమ్ అష్రఫ్ 3-29, షాహీన్ అఫ్రిది 1-20
మొత్తంగా పాకిస్తాన్ పై భారత్ విజయం సాధించడంలో తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ కీలక పాత్ర పోషించింది. అలాగే, భారత బౌలర్లు రాణించడంతో పెద్దస్కోరును పాక్ చేయలేకపోయింది.