72 దేశాల క్రీడాకారులు పాల్గొనే కామన్వెల్త్ గేమ్స్ కు అన్ని ఒకే అయితే అహ్మదాబాద్ వేదిక కానుంది. వేల సంఖ్యలో క్రీడాకారులు, కోచ్లు, అధికారికులు, పర్యాటకులు, మీడియా ప్రతినిధులు రావడం వల్ల స్థానిక వ్యాపారాలు లాభపడతాయని కేంద్రం తెలిపింది.
ఈవెంట్ నిర్వహణ వల్ల పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందనీ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా వస్తాయని అంచనా. స్పోర్ట్స్ సైన్స్, ఈవెంట్ మేనేజ్మెంట్, లాజిస్టిక్స్, రవాణా, ప్రసార మీడియా, ఐటి, కమ్యూనికేషన్, పబ్లిక్ రిలేషన్స్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు కలుగనున్నాయి.