2007లో అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టిన రోహిత్ శర్మ ఇప్పటివరకు 67 టెస్టులు, 287 వన్డేలు, 159 టీ20 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడాడు. మరోవైపు 2008లో అరంగేట్రం చేసిన విరాట్ కోహ్లీ 123 టెస్టులు, 313 వన్డేలు, 125 టీ20 అంతర్జాతీయ మ్యాచ్ల్లో భారత్కు సేవలందించాడు. దాదాపు రెండు దశాబ్దాలుగా భారత క్రికెట్కు వెన్నెముకలా నిలిచిన ఈ ఇద్దరు దిగ్గజాలు, మరో అరుదైన మైలురాయిని చేరుకుని తమ గొప్ప ప్రయాణానికి మరో ప్రత్యేక అధ్యాయాన్ని జోడించారు.