కెప్టెన్సీ ఎవరు తీసుకుంటారు?
రోహిత్ శర్మ తర్వాత కెప్టెన్సీ కోసం కొందరి పేర్లు చర్చకు వస్తున్నాయి. వారిలో హార్దిక్ పాండ్యా, అజింక్య రహానె, కేఎల్ రాహుల్, శ్రేయాస్ అయ్యర్ ముందు వరుసలో ఉన్నారు. యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇవ్వడంపై సెలెక్టర్లు దృష్టి సారించడంతో అజింక్య రహానేను ఎంపిక చేసే అవకాశాలు తక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అంతేకాకుండా హార్దిక్ పాండ్యా కూడా గాయపడుతుండటంతో అతడికి చోటు కల్పించే అవకాశాలపై చర్చ సాగుతోంది. ఇక కేఎల్ రాహుల్ లేదా శ్రేయాస్ అయ్యర్ పేరును ప్రధానంగా పరిశీలించవచ్చు.