అబు ధాబీలో సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ అబుధాబీలో అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ మధ్య జరగనుంది. టీమిండియా తన తొలి మ్యాచ్ ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది. సెప్టెంబర్ 20 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.
• సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ
• సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్
• సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్
భారత జట్టు : సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.