ఆసియా కప్ 2025: 8 జట్లలో 5 జట్లకు ఇండియా-పాక్ ప్లేయర్లే కెప్టెన్లు

Published : Sep 05, 2025, 10:16 PM IST

Asia Cup 2025: ఆసియా కప్ 2025లో మొత్తం 8 జట్లు పాల్గొంటున్నాయి. ఈ సారి టీ20 ఫార్మాట్ లో టోర్నీని నిర్వహిస్తున్నారు. ఆసియా కప్ లో పాల్గొన్న ప్లేయర్లలో 5 జట్లకు భారత, పాకిస్తాన్ ఆటగాళ్లు కెప్టెన్లుగా ఉన్నారు. విచిత్రంగా అనిపించినా ఇది నిజం ! 

PREV
15
ఆసియా కప్ 2025 సర్వం సిద్ధం

ఆసియా కప్ 2025 కౌంట్‌డౌన్ మొదలైంది. ఇంకా నాలుగు రోజుల్లోనే ఈ మెగా టోర్నమెంట్ ప్రారంభం కానుంది. మొత్తం 8 దేశాలు పోటీలో పాల్గొంటున్నాయి. అయితే, ఈసారి ఒక ఆసక్తికరమైన సంఘటన చోటుచేసుకుంది. ఐదు జట్లకు భారత్, పాకిస్తాన్‌కు చెందిన ఆటగాళ్లే కెప్టెన్లుగా ఉన్నారు.

DID YOU KNOW ?
ఆసియా కప్ లో శ్రీలంక
ఇప్పటివరకు భారత జట్టు 8 సార్లు ఆసియా కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఆ తర్వాత 6 సార్లు ఛాంపియన్ గా నిలిచిన శ్రీలంక రెండో స్థానంలో ఉంది.
25
ఒమన్ జట్టులో భారత మూలు

భారత జట్టుకు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. అయితే భారత మూలాలు ఉన్న మరో ఆటగాడు కూడా మరో జట్టుకు నాయకత్వం వహిస్తున్నాడు. పంజాబ్‌లోని లుధియానాలో పుట్టిన జతీందర్ సింగ్ ప్రస్తుతం ఒమన్ తరఫున ఆడుతున్నాడు. ఈసారి ఆసియా కప్‌లో ఒమన్ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు. దీంతో రెండు జట్లకు భారత ప్లేయర్లు కెప్టెన్లుగా ఉన్నారని చెప్పవచ్చు.

35
యూఏఈ, హాంకాంగ్ జట్లలో పాకిస్తానీ మూలాలు

పాకిస్తాన్ జట్టుకు సల్మాన్ అలీ అఘా కెప్టెన్. కానీ మరో రెండు జట్ల కెప్టెన్లు కూడా పాకిస్తాన్ మూలాలు ఉన్నవారు కావడం విశేషం. ముహమ్మద్ వసీమ్ యూఏఈ జట్టుకు కెప్టెన్. అతను పాకిస్తాన్‌లోని పంజాబ్ రాష్ట్రం, ఖానేవాల్ జిల్లాలో పుట్టాడు. ఇప్పుడు యూఏఈ పౌరసత్వం పొంది ఆ దేశాన్ని ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. యాసిమ్ ముర్తజా హాంకాంగ్ జట్టుకు కెప్టెన్. అతను కూడా పాకిస్తాన్‌లోని సియాల్కోట్‌లో పుట్టాడు. ఇప్పుడు హాంకాంగ్ జట్టును నడిపిస్తున్నాడు.

45
సెప్టెంబర్ 9 నుంచి ఆసియా కప్ 2025 టోర్నమెంట్

ఆసియా కప్ 2025 టోర్నమెంట్ సెప్టెంబర్ 9న అబు ధాబీలో అఫ్గానిస్తాన్ vs హాంకాంగ్ మ్యాచ్‌తో ప్రారంభమవుతుంది. భారత జట్టు తన మొదటి మ్యాచ్‌ను సెప్టెంబర్ 10న యూఏఈతో ఆడనుంది.

ఆసియా కప్ 2025 భారత జట్టు షెడ్యూల్

• సెప్టెంబర్ 10: భారత్ vs యూఏఈ

• సెప్టెంబర్ 14: భారత్ vs పాకిస్తాన్

• సెప్టెంబర్ 19: భారత్ vs ఒమన్

సెప్టెంబర్ 20 నుంచి ప్లే ఆఫ్ మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఫైనల్ సెప్టెంబర్ 28న జరగనుంది.

55
ఆసియా కప్ 2025 కోసం భారత జట్టు

గతంలో ఉన్నట్లుగా ఈసారి భారత్‌లో ట్రైనింగ్ క్యాంప్ జరగలేదు. ఆటగాళ్లందరినీ నేరుగా దుబాయ్‌లో ఐసీసీ అకాడమీకి పంపించారు. సెప్టెంబర్ 5 నుంచి ప్రాక్టీస్ సెషన్ ప్రారంభమవుతుంది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ముందే దుబాయ్ చేరుకున్నారు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ముంబై నుంచి బయల్దేరనున్నారు. వైస్ కెప్టెన్ శుభ్ మన్ గిల్ బెంగళూరు నుంచి బయలుదేరనున్నారు.

భారత జట్టు స్క్వాడ్

సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, శివమ్ దూబే, అక్షర్ పటేల్, జితేష్ శర్మ (వికెట్ కీపర్), జస్ప్రీత్ బుమ్రా, అర్షదీప్ సింగ్, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, సంజూ శాంసన్, (వికెట్ కీపర్), హర్షిత్ రాణా, రింకూ సింగ్.

స్టాండ్‌బై: యశస్వి జైస్వాల్, ప్రసిద్ధ్ కృష్ణ, వాషింగ్టన్ సుందర్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురేల్.

Read more Photos on
click me!

Recommended Stories