భారత జట్టులో మార్పులు.. బుమ్రా ప్లేయింగ్ 11లో ఉంటారా?
భారత జట్టు విషయానికి వస్తే, జస్ప్రీత్ బుమ్రా ఎంపికపై స్పష్టత లేదు. రెండో టెస్టు విశ్రాంతి తర్వాత మూడో టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా మొదటి ఇన్నింగ్స్లో ఐదు వికెట్లు తీశాడు. ఈ సిరీస్ లో నాల్గో మ్యాచ్ కీలకం కానుంది. కాబట్టి బుమ్రా జట్టులో ఉండటం కీలకం.
అయితే, అతని శారీరక స్థితిని బట్టి అతడి స్థానం నిర్ణయించనున్నారని సమాచారం. వర్క్ లోడ్ కారణంగా మూడు టెస్టులు మాత్రమే ఆడనున్నాడని ఇప్పటికే భారత క్రికెట్ వర్గాలు వెల్లడించాయి. బుమ్రా లేకపోతే ప్రసిద్ధ్ క్రిష్ణ లేదా అర్షదీప్ సింగ్కు అవకాశం లభించనుంది.
బ్యాటింగ్లో మాత్రం నంబర్ 3 స్థానంలో మార్పు పక్కాగా కనిపిస్తోంది. కరుణ్ నాయర్ నుంచి ఆశించిన ప్రదర్శన లేకపోవడంతో, సాయి సుదర్శన్ కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. గిల్ల్ సారథ్యంలో జట్టు సమతుల్యత కోసం ఇదే సరైన మార్గమని భావిస్తున్నారు.
నాల్గో టెస్టుకు భారత ప్లేయింగ్ 11 అంచనా జట్టు
యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, బుమ్రా/ప్రసిద్ధ్, మహ్మద్ సిరాజ్.