ENG vs IND: ఉత్కంఠ‌ను పెంచుతున్న మాంచెస్టర్ టెస్టు.. బుమ్రా ఆడ‌తారా? డాసన్ వన్‌మోర్ ఛాన్స్ !

Published : Jul 15, 2025, 11:57 PM IST

ENG vs IND 4th Test Preview: మాంచెస్టర్‌లో జూలై 23న ప్రారంభమయ్యే 4వ టెస్టులో బుమ్రా ఎంపిక భార‌త్ కు కీలకం. డాసన్ 8 ఏళ్ల తర్వాత ఇంగ్లాండ్ నుంచి టెస్ట్‌ పిలుపు అందుకున్నాడు. హీట్ పెంచిన లార్డ్స్ టెస్ట్ త‌ర్వాత జ‌రుగుతున్న ఈ మ్యాచ్ ఉత్కంఠ‌ను పెంచుతోంది.

PREV
15
ఉత్కంఠగా సాగుతున్న భార‌త్ - ఇంగ్లాండ్ టెస్టు సిరీస్

ఇంగ్లాండ్ స్వదేశంలో 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో ఇప్పటికే 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. కానీ, భార‌త్ అద్భుత‌మైన పోరాటంతో ఈ సిరీస్ మ‌రింత ఉత్కంఠ‌గా ముందుకు సాగుతోంది. లార్డ్స్ టెస్టులో కేవ‌లం 22 పరుగుల తేడాతో భార‌త్ ఓడిపోయింది.

ఈ విజయంతో ఇంగ్లాండ్ ఆత్మవిశ్వాసంతో నాల్గో టెస్టుకు సిద్ధంగా ఉంది. జూలై 23 నుంచి మాంచెస్టర్‌లో ప్రారంభమయ్యే నాలుగవ టెస్టులో అదే జోరు కొనసాగించాలని చూస్తోంది. మరోవైపు భారత జట్టు మాత్రం ఈ మ్యాచ్‌లో గెలవాల్సిందేనన్న ఒత్తిడిలో ఉంది, లేదంటే సిరీస్ చేజారిపోతుంది. ఇది వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికపై కూడా ప్రభావం చూపుతుంది.

25
భారత జట్టులో మార్పులు.. బుమ్రా ప్లేయింగ్ 11లో ఉంటారా?

భారత జట్టు విషయానికి వస్తే, జస్ప్రీత్ బుమ్రా ఎంపికపై స్పష్టత లేదు. రెండో టెస్టు విశ్రాంతి తర్వాత మూడో టెస్టులో అద్భుత ప్రదర్శన కనబరిచాడు. బుమ్రా మొదటి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీశాడు. ఈ సిరీస్ లో నాల్గో మ్యాచ్ కీల‌కం కానుంది. కాబ‌ట్టి బుమ్రా జ‌ట్టులో ఉండ‌టం కీల‌కం. 

అయితే, అత‌ని శారీరక స్థితిని బట్టి అతడి స్థానం నిర్ణయించ‌నున్నారని స‌మాచారం. వ‌ర్క్ లోడ్ కార‌ణంగా మూడు టెస్టులు మాత్ర‌మే ఆడ‌నున్నాడ‌ని ఇప్ప‌టికే భార‌త క్రికెట్ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. బుమ్రా లేకపోతే ప్రసిద్ధ్ క్రిష్ణ లేదా అర్షదీప్ సింగ్‌కు అవకాశం ల‌భించ‌నుంది.

బ్యాటింగ్‌లో మాత్రం నంబర్ 3 స్థానంలో మార్పు ప‌క్కాగా క‌నిపిస్తోంది. కరుణ్ నాయర్ నుంచి ఆశించిన ప్రదర్శన లేకపోవడంతో, సాయి సుదర్శ‌న్ కు ఛాన్స్ ఇవ్వనున్నట్లు సమాచారం. గిల్ల్ సారథ్యంలో జట్టు సమతుల్యత కోసం ఇదే సరైన మార్గమని భావిస్తున్నారు.

నాల్గో టెస్టుకు భార‌త ప్లేయింగ్ 11 అంచ‌నా జ‌ట్టు

యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుద‌ర్శన్, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రిషబ్ పంత్ (వికెట్), నితీష్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, ఆకాష్ దీప్, బుమ్రా/ప్రసిద్ధ్, మహ్మద్ సిరాజ్.

35
ఇంగ్లాండ్ జట్టులో మార్పులు.. స్పిన్నర్ డాసన్ సెన్సేషనల్ రీ ఎంట్రీ

ఇంగ్లాండ్ మాత్రం దాదాపు అదే జట్టుతో బరిలోకి దిగనుంది. అయితే లార్డ్స్ టెస్టులో గాయపడ్డ స్పిన్నర్ షోయబ్ బషీర్ జట్టులో ఉండే అవకాశాలు తగ్గిపోయాయి. అతని స్థానంలో ఎనిమిదేళ్ల తర్వాత లియామ్ డాసన్‌ను జట్టులోకి తీసుకున్నారు. 

2017 తర్వాత టెస్టు ఆడిన డాసన్.. 2023, 2024లో కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శనలతో PCA ప్లేయర్ ఆఫ్ ద ఇయర్‌గా నిలిచాడు. ఇప్పుడు అత‌నికి జ‌ట్టును పిలుపు వ‌చ్చింది. గస్ అట్కిన్సన్ కూడా టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ చేసే అవకాశముందని రిపోర్టులు పేర్కొంటున్నాయి.

మాంచెస్ట‌ర్ టెస్టుకు ఇంగ్లాండ్ ప్లేయింగ్ 11 అంచ‌నా జ‌ట్టు

జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్, జో రూట్, హ్యారీ బ్రుక్, బెన్ స్టోక్స్ (కెప్టెన్), జేమీ స్మిత్ (వికెట్), క్రిస్ వోక్స్, బ్రైడన్ కార్స్, జోఫ్రా ఆర్చర్, డాసన్/అట్కిన్సన్.

45
మాంచెస్టర్ గ్రౌండ్ రికార్డులు ఎలా ఉన్నాయి?

మాంచెస్ట‌ర్ లోని ఒల్డ్ ట్రాఫర్డ్ మైదానంలో ఇప్పటివరకు 85 టెస్టులు జరగగా, మొదట బ్యాటింగ్ చేసిన జట్లు 32 విజయాలు సాధించాయి. రెండవ బ్యాటింగ్ జట్లు 17 మ్యాచ్‌లు గెలిచాయి. 36 టెస్టులు డ్రాగా ముగిశాయి. టాస్ కీల‌కం కానుంద‌ని చెప్ప‌వ‌చ్చు. టాస్ గెలిచిన జట్లు 29 విజయాలు సాధించాయి.

  • అత్యధిక వ్యక్తిగత స్కోరు: 311 ప‌రుగులు, ఆస్ట్రేలియా ఆటగాడు ఆర్.బీ. సింప్సన్ (1964)
  • అత్యధిక వికెట్లు (ఇన్నింగ్స్‌లో): 10/53, జేసీ లేకర్ (1956)
  • అత్యధిక వికెట్లు (మ్యాచ్‌లో): 19/90 , జేసీ లేకర్ (1956)
  • అత్యధిక జట్టు స్కోరు: 656/8 డిక్లేర్, ఆస్ట్రేలియా vs ఇంగ్లాండ్
  • తక్కువ స్కోరు: 58 ప‌రుగులు, భారత జట్టు (1952)
55
జ‌ట్ల మార్పులు ఫలితంపై ప్రభావం చూపేనా?

మాంచెస్ట‌ర్ టెస్ట్ భారత జట్టుకు కీలకం. గెలిస్తే సిరీస్ సమం అవుతుంది, లేదంటే సిరీస్ ఇంగ్లాండ్ చేతిలోకి వెళుతుంది. ఆటగాళ్ల ఎంపిక, గణాంకాలు, పిచ్ పరిస్థితులు.. ఇవన్నీ ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించనున్నాయి. అంత తేలికగా తీసుకోకూడదని భారత్ వ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. 

మాంచెస్టర్‌లోని పేస్-సహజ వాతావరణం బుమ్రా, ఆర్చర్ వంటి బౌలర్లకు ప్లస్ అయ్యే అవకాశముంది. డబ్ల్యూటీసీ పాయింట్లలో కూడా ఈ ఫలితం ప్రభావం చూపనుంది. ఇక టెస్టు ముగిసే సమయానికి, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ రేసులో ఎవరు ముందుంటారో చూడాలి.

Read more Photos on
click me!

Recommended Stories