నేడు భారీ పతనంతో ముగిసిన స్టాక్ మార్కెట్‌.. సెన్సెక్స్, నిఫ్టీ పడిపోవడానికి ముఖ్య కారణాలు తెలుసుకోండి..

First Published Nov 22, 2021, 7:49 PM IST

నేడు వారంలో మొదటి రోజున సోమవారం ఉదయం స్టాక్‌ మార్కెట్లు (stock markets)బలహీనంగా ప్రారంభమయ్యాయి. బి‌ఎస్‌ఈ 30-షేర్ సెన్సెక్స్ 287.16 పాయింట్లు (0.48 శాతం) క్షీణించి 59,348.85 వద్ద ప్రారంభమైంది. మరోవైపు ఎన్‌ఎస్‌ఈ (nse)నిఫ్టీ (nifty)కూడా బలహీనంగా ప్రారంభమైంది. షేర్ మార్కెట్  రెడ్ మార్క్‌లో ప్రారంభమైన తర్వాత కొద్దిసేపటికే సెన్సెక్స్(sensex) భారీగా పడిపోయింది. 

ఒక విధంగా 30-షేర్ ఇండెక్స్ కొంత సమయానికి 500 పాయింట్లకు పైగా విచ్ఛిన్నమైంది. ఈ పతనం ఇక్కడితో ఆగలేదు మధ్యనం 12 గంటల వరకు సెన్సెక్స్ 890.65 పాయింట్లు జారిపోయి 59 వేల స్థాయి దిగువకు వచ్చింది. చివరికి ట్రేడింగ్ ముగిసే సమయానికి బిఎస్‌ఇ సెన్సెక్స్ 1170 పాయింట్లు నష్టపోగా, ఎన్‌ఎస్‌ఇ నిఫ్టీ 348 పాయింట్లు నష్టపోయింది. 

లాభాలను చేరుకోలేకపోయిన సెన్సెక్స్-నిఫ్టీ 
సెన్సెక్స్ ఈరోజు 287.16 పాయింట్లు (0.48 శాతం) పతనంతో 59,348.85 వద్ద ప్రారంభమైంది అలాగే ట్రేడింగ్ ముగిసే వరకు స్టాక్ మార్కెట్ క్షీణత కొనసాగింది. ట్రేడింగ్‌ సమయంలో  1333.88 పాయింట్లు (2.24 శాతం) తగ్గి 58,302.13 స్థాయికి చేరుకుంది. అయితే ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ స్వల్పంగా కోలుకుని 1170 పాయింట్ల నష్టంతో 58,465.89 వద్ద ముగిసింది.

దారుణంగా పడిపోయిన ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ
నేడు కూడా ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీకి  ఒక  బ్యాడ్ డే  ఉదయం బలహీనమైన ప్రారంభం తర్వాత నిఫ్టీ కోలుకోలేకపోయింది. మార్కెట్ ప్రారంభంలో నిఫ్టీ 87.35 పాయింట్లు (0.49 శాతం) క్షీణించి 17,677.45 వద్ద ప్రారంభమైంది. ఆ తర్వాత సమయం గడిచే కొద్దీ ట్రేడింగ్ సమయంలో నిఫ్టీ 392.45 పాయింట్లు (2.41 శాతం) క్షీణించి 17372.35 కనిష్ట స్థాయికి చేరుకుంది. ట్రేడింగ్ ముగిసే సమయానికి నిఫ్టీ 348 పాయింట్ల నష్టంతో 17,416 వద్ద ముగిసింది.  

బలహీనమైన ప్రపంచ సంకేతాలు, ఐరోపాలో పెరుగుతున్న కరోనా కేసులతో సహా ఈ రోజు స్టాక్ మార్కెట్‌లో పతనానికి ఐదు ప్రధాన కారణాలు ఉన్నాయి. 

బలహీనమైన ప్రపంచ సంకేతాలు
ఆసియా స్టాక్ మార్కెట్లు నవంబర్ 22న రోజంతా అస్థిరంగా కొనసాగాయి. బలహీనమైన అంతర్జాతీయ సంకేతాలు దేశీయ స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపాయి. దీంతో స్టాక్ మార్కెట్లు రోజంతా కోలుకోలేక చివరకు భారీ పతనంతో ముగిశాయి. 

ఫారెక్స్ నిల్వల్లో క్షీణత
నవంబర్ 12తో ముగిసిన వారంలో దేశ విదేశీ మారక నిల్వలు 763 మిలియన్ డాలర్లు తగ్గి 640.112 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయని ఆర్‌బిఐ డేటా వెల్లడించింది. సెప్టెంబరు 3తో ముగిసిన వారంలో 642.453 బిలియన్ డాలర్ల ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, విదేశీ మారక నిల్వల తగ్గింపు ప్రభావం మార్కెట్‌పై కూడా కనిపించింది. 

రిలయన్స్ అండ్ సౌదీ అరామ్‌కో డీల్ ప్రభావం
రిలయన్స్ ఇండస్ట్రీస్ సౌదీ అరామ్‌కో నవంబర్ 19న O2C వ్యాపారంలో ప్రతిపాదిత పెట్టుబడిని రిఎవాల్యుయేట్ చేయాలని నిర్ణయించుకున్నాయి. రిలయన్స్ ఆయిల్ టు కెమికల్ వ్యాపారంలో అరమ్‌కో 20 శాతం వాటాను కొనుగోలు చేయాల్సి ఉంది, అయితే మారుతున్న పరిస్థితులు, వాతావరణంలో రెండు కంపెనీలు ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాయి. దీంతో సోమవారం రిలయన్స్‌ షేరు పతనం కొనసాగింది. 

పేటీఎం షేర్ల పతనం 
పేటీఎం (one97 communications) స్టాక్ ధర తాజాగా చరిత్రలో చెత్త లిస్టింగ్-డే పర్ఫర్మెంస్ తర్వాత రెండు రోజుల్లో 44 శాతం పడిపోయింది. దీని ప్రభావం నేడు మార్కెట్‌పై కూడా కనిపించింది. 

యూరప్‌లో కరోనా కేసుల పెరుగుదల స్టాక్  మార్కెట్ క్షీణతకు ప్రధాన కారణాలలో ఒకటి. కరోనా కేసుల పెరుగుదల ఇన్వెస్టర్ల సెంటిమెంట్లను ప్రభావితం చేసింది. దీంతో షేర్ మార్కెట్ బలహీన సంకేతాలను చూపి క్షీణత పెరిగింది. 
 

click me!