Indian Railways: రైల్వే సూపర్ అనౌన్స్‌మెంట్.. రాత్రిపూట ట్రైనులో గట్టిగా మాట్లాడుతూ గోల చేస్తే భారీ జరిమానా

Published : Mar 01, 2026, 11:20 AM IST

Indian Railways: రైళ్లలో ప్రయాణించే  సీనియర్ సిటిజన్లకు మంచి శుభవార్త. ఇకపై వారు ప్రశాంతంగా రైలు ప్రయాణ సమయంలో నిద్రపోవచ్చు. వారి నిద్రకు భంగం కలిగించేలా ఎవరైనా ప్రవర్తిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది రైల్వేే శాఖ.

PREV
14
రైలు ప్రయాణం ప్రశాంతంగా

భారత రవాణా వ్యవస్థలో రైళ్లే అతి ప్రధానమైనవి. ప్రతిరోజూ దేశ వ్యాప్తంగా కోట్ల మంది రైళ్లలో ప్రయాణిస్తుంటారు. బస్సులో బెర్త్ బుక్ చేసుకున్నా కుదుపుల వల్ల సరిగా నిద్రపట్టదు. కానీ రైళ్లలో బెర్త్ బుక్ చేసుకుంటే ప్రశాంతంగా నిద్రపోవచ్చని ఎంతో మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్స్ ఇలా ప్రశాంతమైన నిద్రను కోరుకుంటారు. కానీ వారి నిద్రకు భంగం కలిగేలా కొంతమంది ప్రవర్తిస్తూ ఉంటారు. అందుకే ఇండియన్ రైల్వే శాఖ కొన్ని కఠిన రూల్స్ ను అమల్లోకి తెచ్చింది. అవి పాటించకపోతే భారీ జరిమానాలను కూడ వేస్తుంది.

24
రాత్రి 10 దాటితే ఈ రూల్స్

రైళ్లలోని రిజర్వేషన్ బోగీలలో ప్రయాణికులు ఎలా ఉండాలో కొన్ని రూల్స్ పెట్టింది.  రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఆ రూల్స్ అమల్లోకి వస్తాయి.  ఫోన్‌లో గట్టిగా మాట్లాడకూడదు. సెల్‌ఫోన్‌లో సినిమాలు లేదా రీల్స్ చూసేటప్పుడు తప్పనిసరిగా హెడ్‌ఫోన్స్ వాడాలి. రాత్రి 10 గంటల తర్వాత లైట్లు ఆపేయాలి. ఇలా చాలా రూల్స్ ను పెట్టింది. ఈ మధ్య కొందరు యువకులు ఈ నియమాలను ఇంట్లో ఉన్నట్టుగా ఫోన్‌లో పెద్ద సౌండ్‌తో రీల్స్, సినిమాలు చూస్తూ ఇబ్బంది పెడుతున్నారు. దీని వల్ల సీనియర్ సిటిజెన్లు నిద్ర పట్టక ఇబ్బంది పడుతున్నారు. రైల్వే పోలీసులకు కంప్లైంట్ చేస్తే వారు కఠిన చర్యలు తీసుకుంటారు.

34
కఠినంగా వ్యవహరించాలి

రాత్రి పది అవుతున్న నిద్రపోకుండా ఫోన్‌లో గట్టిగా మాట్లాడటం, లైట్లు ఆపకపోవడం వంటి పనులతో తోటి ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుంది. ముఖ్యంగా 60 ఏళ్లు దాటిన వారు తీవ్రంగా ఇబ్బంది పడతారు. డబ్బులు పెట్టి బెర్త్ బుక్ చేసుకున్నా ప్రశాంతంగా నిద్రపోలేకపోతున్నామని వారు బాధపడతారు. అందుకే రైల్వే శాఖ ఈ హెచ్చరిక జారీ చేసింది. రాత్రి 10 తర్వాత నిబంధనలు ఉల్లంఘిస్తే, గట్టిగా పాటలు విన్నా, రీల్స్ చూసినా భారీ జరిమానా విధిస్తామని స్పష్టం చేసింది. 

44
మిడిల్ బెర్తు రూల్స్

మిడిల్ బెర్తుకు కూడా రూల్స్ పెట్టింది రైల్వే శాఖ. రిజర్వేషన్ బోగీలో రాత్రి 10 గంటల తర్వాత లైట్లు ఆపేయాలి. రాత్రి 10 గంటలకు మిడిల్ బెర్త్‌ను పైకి లేపుకోవాలి. ఉదయం 6 గంటలకు దాన్ని కిందకు దించాలి. ఈ రూల్స్ మీరితే జరిమానా తప్పదని రైల్వే హెచ్చరించింది.

Read more Photos on
click me!

Recommended Stories