ఉద్యోగుల భవిష్య నిధి (EPF) భారతదేశంలోని వేతన ఉద్యోగుల కోసం తీసుకొచ్చిన సామాజిక భద్రతా పథకం. ఇది కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ పరిధిలోని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO) నిర్వహిస్తుంది.
1952లో ప్రారంభమైన ఈ పథకం ప్రకారం, 20 లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న సంస్థలకు ఇది తప్పనిసరి. ఉద్యోగులు చేరిన రోజునుండే ఇందులో సభ్యత్వం లభిస్తుంది.
ఉద్యోగి, యజమాని ఇద్దరూ వేతనంలో సుమారు 12% చొప్పున ఈపీఎఫ్ ఖాతాకు చెల్లిస్తారు. ప్రభుత్వమే ప్రతి సంవత్సరం వడ్డీ రేటును ప్రకటిస్తుంది. ఈపీఎఫ్ఓ మూడు ప్రధాన పథకాలను నిర్వహిస్తుంది. అవి..
1. ఉద్యోగుల భవిష్య నిధి (EPF), 1952 – రిటైర్మెంట్ సేవింగ్స్ కోసం.
2. ఉద్యోగుల పెన్షన్ స్కీమ్ (EPS), 1995 – 58 ఏళ్ల వయసు తర్వాత పింఛన్ కోసం.
3. ఉద్యోగుల డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ (EDLI), 1976 – బీమా ప్రయోజనాల కోసం.
ఈ మార్పులతో ఈపీఎఫ్ఓ సభ్యులకు మరింత సౌలభ్యం లభించనుంది. అయితే, పీఎఫ్ నిధులను దీర్ఘకాలిక భద్రత కోసం ఉపయోగించడం అత్యంత అవసరం, దానికి అనుగుణంగా మార్పులు ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.