ఒకప్పుడు బిలియనీర్లు... నేడు అప్పులలో కూరుకుపోయి...ఆస్తులు కరిగిపోయి..

First Published Jan 3, 2020, 3:58 PM IST

2019లో బిలియనీర్ల జాతకాలు పతనం అయ్యాయి. ఆర్థిక మందగమనం, కొరవడిన డిమాండ్, బ్యాంకింగ్, బ్యాంకేతర ఆర్థిక సంస్థల్లో కుంభకోణాలు.. పటిష్ట చట్టాలు కుబేరుల పాలిట కాళరాత్రిగా మారాయి. ఫలితంగా కుబేరుల ఆస్తుల విలువ వేగంగా కరిగిపోయింది. పలువురు బిలియనీర్ల సంపద పతనమైంది.  

న్యూఢిల్లీ: ఒకనాడు రూ. వేల కోట్లకు అధిపతులుగా రాజభోగాలు అనుభవించి, వ్యాపార సామ్రాజ్యాలను శాసించారు. ఇప్పుడు సీన్‌‌ తిరగబడింది. చాలామంది భారతీయ కుబేరులు అప్పుల ఊబిలో కూరుకుపోయి, సంపద పోగొట్టుకున్నారు. కొందరి కంపెనీలు దివాళా బాటలో పయనిస్తున్నాయి.
undefined
ఆస్తులు జప్తు చేయడంతోపాటు కేసులు చుట్టుముట్టాయి. కొత్త ఐబీసీతో గత 18 నెలల్లో ఇండియన్‌‌ బ్యాంకులు వీరి నుంచి రూ. 2,76,900 కోట్లకు పైగా మొండి బకాయిలను వసూలు చేసుకోగలిగాయి. నాన్‌‌బ్యాంకింగ్‌‌ ఫైనాన్స్‌‌ కంపెనీల్లో (ఎన్బీఎఫ్సీ) సంక్షోభం ఏర్పడటంతో, అప్పుల మీద ఆధారపడే వ్యాపారాలు విపరీతంగా నష్టపోయాయి.
undefined
ఫైనాన్స్‌‌ మార్కెట్‌‌లో కొత్తగా అప్పులు పుట్టడం కష్టమైంది. చాలా కంపెనీలు పేక మేడల్లా పడిపోయాయి. కొంత మంది విదేశాలకు పారిపోయారు. వీరిని తిరిగి ఇండియా తీసుకొచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం కష్టాలతో కొట్టుమిట్టాడుతున్న ఒకప్పటి బిలియనీర్ల గురించి తెలుసుకుందాం..
undefined
సరిగ్గా 11 ఏళ్ల క్రితం ప్రపంచ ధనవంతుల జాబితా–2008 లో ఆరో స్థానంలో నిలిచిన అనిల్‌‌ అంబానీ, అప్పులు చెల్లించలేక జైలుకు వెళ్లే పరిస్థితికి దిగజారారు. ఎరిక్సన్‌‌ కంపెనీ అప్పులు చెల్లించలేకపోవడంతో అనిల్ అంబానీ గత ఏడాది తీవ్ర సమస్యలను ఎదుర్కొన్నారు.
undefined
ఈ స్వీడన్‌‌ కంపెనీకి రూ. 550 కోట్లు(వడ్డీలతో సహా) పాత బకాయిల చెల్లించకపోతే మూడు నెలలు జైలుకు వెళ్లాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. అన్న ముకేష్‌‌ అంబానీ చివరి నిమిషంలో ఆయనను ఆదుకున్నారు.
undefined
అనిల్‌‌ అంబానీ టెలికాం కంపెనీ 2019 లో దివాలాకు వచ్చింది. రిలయన్స్‌‌ నావల్‌‌, ఇంజనీరింగ్‌‌ విభాగం నష్టాలతో కొట్టుమిట్టాడుతోంది. అప్పులను తీర్చడానికి రిలయన్స్ క్యాపిటల్‌‌ ఆస్తులను అనిల్ అంబానీ విక్రయించేస్తున్నారు. లాభాల్లో నడిచే రిలయన్స్‌‌ మ్యూచువల్‌‌ ఫండ్‌‌లోని వాటాలనూ అమ్మేశారు.
undefined
ఒకప్పుడు ఎయిర్‌‌ టికెట్‌‌ ఏజెంట్‌‌గా పనిచేసిన నరేష్‌‌ గోయల్‌‌, ప్రైవేట్ విమానయాన సంస్థ ‘జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌’‌ను దేశంలో అతి పెద్ద ఎయిర్‌‌‌‌లైన్‌‌గా నిలిపారు. ఖర్చులు విపరీతంగా పెరగడంతోపాటు, అప్పులు పెరగడంతో జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌ నష్టాల్లోకి జారుకుంది. బ్యాంకులు, ఫైనాన్షియల్‌‌ సంస్థల నుంచి తీసుకున్న అప్పులను కంపెనీ తీర్చలేకపోయింది.
undefined
ఫలితంగా జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌ను బ్యాంకులు టేకోవర్‌‌‌‌ చేశాయి. నరేష్‌‌ గోయల్‌‌ కంపెనీ టాప్‌‌ పొజిషన్‌‌ నుంచి దిగిపోయారు. జెట్ ఎయిర్‌‌‌‌వేస్‌‌లో రూ. 18,460 కోట్ల మేరకు మోసం జరిగిందని, దీనిని దర్యాప్తు చేస్తున్నామని ప్రభుత్వం ప్రకటించింది.
undefined
దీని తర్వాత నరేష్‌‌ గోయల్ విదేశాలకు పారిపోకుండా సుప్రీం కోర్టు అడ్డుకుంది. జెట్‌‌ ఎయిర్‌‌‌‌వేస్‌‌ గత ఏప్రిల్‌‌లో ఎయిర్‌‌‌‌లైన్‌‌ సేవలను నిలిపివేసింది. లెండర్లు దొరక్కపోవడంతో, కంపెనీ దివాలా కోర్టుకు వెళ్లింది.
undefined
ఇండియాలోని అతి పెద్ద కాఫీ చెయిన్‌‌‌‌ కేఫ్‌‌ కాఫీడే వ్యవస్థాపకుడు‌ వీజీ సిద్ధార్థ 2019లో ఆత్మహత్య చేసుకున్నారు. రుణ దాతల నుంచి, ప్రైవేట్‌‌ ఈక్విటీ సంస్థల నుంచి ఒత్తిడి పెరిగిందని, ట్యాక్స్‌‌ ఆఫీసర్ల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయని లెటర్‌‌‌‌ రాసి ఆత్మ హత్య చేసుకున్నారు.
undefined
కాఫీ డే లోని షేర్లను తనఖా పెట్టి, షార్ట్‌‌ పీరియడ్‌‌ కోసం అధిక వడ్డీతో అప్పులు తీసుకున్నారు. ‘చాలా కాలం నుంచి పోరాడుతున్నా. ఈ రోజు అన్నీ వదిలేస్తున్నా’ అని లెటర్‌‌‌‌ రాసి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన భారతదేశ పారిశ్రామిక వర్గాల్లో తీవ్ర సంచలనం సృష్టించింది.
undefined
పేపర్‌‌ మిల్‌‌ నుంచి పవర్‌‌‌‌ ట్రాన్స్‌‌మిషన్‌‌ వరకు వ్యాపారాలు నడుపుతున్న అవంతి గ్రూప్‌‌ను గౌతమ్ థాపర్‌‌‌‌ స్థాపించారు. ఈ గ్రూప్ బాకీలు తీర్చక తనఖాగా పెట్టిన గ్రూప్‌‌ సబ్సిడరీ సీజీ పవర్‌‌ షేర్లను లెండర్లు తీసుకున్నారు. దీంతో సీజీ పవర్‌‌‌‌లో యెస్‌‌ బ్యాంక్‌‌ అతి పెద్ద వాటాదారుగా మారింది.
undefined
సీజీ పవర్‌‌‌‌లో మోసపూరిత ట్రాన్సాక్షన్స్‌‌ జరిగాయని బోర్డు డైరెక్టర్లు గుర్తించారు. దీంతో ఈ కంపెనీ చైర్మన్‌‌ పొజిషన్‌‌ నుంచి గౌతమ్‌‌ థాపర్‌‌‌‌ తప్పుకున్నారు. కంపెనీలో ఫోరెన్సిక్‌‌ ఆడిట్‌‌ను జరపాలని సెబీ ఆదేశించింది. సెక్యురిటీస్ మార్కెట్‌‌ను యాక్సెస్‌‌ చేయకుండా థాపర్​పై నిషేధం విధించింది.
undefined
దేశంలో రెండో అతిపెద్ద హాస్పిటల్‌‌ చెయిన్‌‌ ఫోర్టిస్‌‌ హెల్త్‌‌కేర్‌‌ను మల్విందర్‌‌ సింగ్‌‌‌‌, శివిందర్‌‌‌‌ సింగ్‌ స్థాపించారు. ఈ సంస్థ నుంచి అక్రమంగా రూ. 2,392.7 కోట్లను, ప్రమోటర్‌‌‌‌ కంపెనీలకు దారి మళ్లించారని గత అక్టోబర్‌‌‌‌లో వీరిని అరెస్ట్‌‌ చేశారు.
undefined
తర్వాత ఈ అన్నదమ్ములు ఫోర్టిస్‌‌ హెల్త్ కేర్‌‌‌‌లోని టాప్‌‌ పొజిషన్ల నుంచి వైదొలిగారు. వీరు తమ హాస్పిటల్‌‌ కంపెనీకి రూ. 403.99 కోట్లు వరకు మోసం చేశారని సెబీ 2018లో గుర్తించింది.
undefined
దేశంలోని అతిపెద్ద ప్రైవేట్‌‌ బ్యాంక్ యెస్‌‌ బ్యాంక్‌‌ ఫౌండర్‌‌‌‌ రాణా కపూర్‌‌. యెస్‌‌ బ్యాంక్ షేర్లను విలువ కట్టలేమని, వారసత్వంగా వచ్చే షేర్లను తన పిల్లలు దాచుకుంటారని 2018 సెప్టెంబర్‌‌లో ఆయన ట్వీట్‌‌ చేశారు.
undefined
కానీ యెస్‌‌ బ్యాంక్‌‌లోని తన వాటాను 20‌‌‌‌19 అక్టోబర్‌‌‌‌ నాటికి అమ్మేశారు. మొండి బకాయిలు విపరీతంగా పెరగడంతో బ్యాంక్‌‌ లాభాలు దెబ్బతిన్నాయి. యెస్‌‌ బ్యాంక్ టాప్‌‌ పొజిషన్‌‌ నుంచి రాణాకపూర్‌‌‌‌ తప్పుకోవాల్సి వచ్చింది.
undefined
మీడియా మొఘల్‌‌గా ఎదిగారు సుభాష్‌‌ చంద్ర. 1990 లో జీ టీవీ స్థాపించి, కేబుల్‌‌ టీవీని జనానికి దగ్గరగా తీసుకొచ్చారు సుభాష్ చంద్ర. అయితే, అప్పులను తీర్చేందుకు జీ ఎంటర్‌‌‌‌టైన్‌‌ మెంట్‌‌లోని ప్రమోటర్ల వాటాను విక్రయించడం ప్రారంభించారు. 2019 నాటికి జీ గ్రూప్​పై పట్టు కోల్పోవడంతో పాటు, చైర్మన్‌‌ పదవి నుంచి తప్పుకున్నారు.
undefined
అప్పుల, లీగల్​ సమస్యల వల్ల ఎస్సార్‌‌‌‌ స్టీల్‌‌ను గతేడాది రూ. 41,890 కోట్లకు ఆర్సెల్‌‌ మిట్టల్‌‌కు శశికాంత్‌‌, రవికాంత్‌‌ రుయా విక్రయించారు. ఎస్సార్‌‌‌‌ గ్రూప్‌పై నియంత్రణ కలిగి ఉన్న శశికాంత్‌‌ రుయా, రవి కాంత్‌‌ రుయా డాక్యుమెంట్లను దాచి పెట్టారని 2019 మార్చిలో బ్రిటన్ జడ్జి మందలించారు. ఎస్సార్ ‌‌ కన్‌‌స్ట్రక్షన్‌‌ కంపెనీగా 1969లో ప్రారంభమైన ఎస్సార్‌‌‌‌ గ్రూప్‌‌, 2008–12 మధ్య వివిధ సెక్టార్లలో రూ.1,27,800 కోట్లను పెట్టుబడిగా పెట్టింది.
undefined
click me!