మేష రాశి...
పరాభవ నామ సంవత్సర ఉగాది తర్వాత నుంచి మేష రాశివారికి స్వర్ణ యుగం ప్రారంభం కానుంది. గురు గ్రహం ఈ రాశివారికి అనుకూల స్థితిలో ఉంటుంది. దీని వల్ల.. ఈ రాశి వారికి ఆగిపోయిన పనులు చాలా వేగవంతంగా అవుతాయి. కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అవివాహితులకు వివాహ యోగం ఉంది. కోరుకున్న పనులన్నీ పూర్తి చేయగలుగుతారు. ఈ సమయం అంతా చాలా అనుకూలంగా ఉంటుంది.