ఈ రాశులవారు జాగ్రత్తగా ఉండాల్సిందే..
ఈ గ్రహణం కుంభ రాశిలో జరుగుతోంది కాబట్టి కుంభం, వృశ్చికం , మకర రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఆరోగ్య విషయంలోనూ, వాహనం నడిపేటప్పుడు అప్రమత్తత అవసరం.
అదృష్టం పెరగడానికి చేయాల్సిన పరిహారాలు:
గ్రహణ సమయంలో , గ్రహణం తర్వాత ఈ పనులు చేయడం వల్ల దోషాలు తొలగి అదృష్టం పెరుగుతుంది:
గ్రహణ సమయంలో 'ఆదిత్య హృదయం' లేదా 'సూర్యాష్టకం' పఠించడం.
గ్రహణం ముగిసిన తర్వాత పవిత్ర నదీ స్నానం లేదా ఇంట్లోనే గంగాజలంతో స్నానం చేయడం.
పేదలకు గోధుమలు, బెల్లం లేదా ఎరుపు రంగు వస్త్రాలను దానం చేయడం.
'ఓం నమో భగవతే వాసుదేవాయ' అనే మంత్రాన్ని జపించడం.