జ్యోతిష్య శాస్త్రం ప్రకారం తొమ్మిది గ్రహాలు క్రమం తప్పకుండా సంచరిస్తూ ఉంటాయి. అనేక శుభ, అశుభ యోగాలను ఏర్పరుస్తుంటాయి. అశుభ యోగమైతే కొన్ని రాశులవారి జీవితాల్లో కష్టాలు వస్తాయి. శుభప్రదమైన రాజయోగం ఏర్పడితే జీవితంలో ఆహ్లాదకరమైన మార్పులు వస్తాయి.
సరిగ్గా అలాంటి ఒక శుభ రాజయోగం నేడు(మంగళవారం) ఏర్పడనుంది. నేడు చంద్రుడు మిథున రాశిలోకి ప్రవేశిస్తాడు. సూర్యుడు, గురువు ఇప్పటికే ఈ రాశిలో ఉన్నారు. చంద్రుడు, సూర్యుని సంయోగం వల్ల శశి ఆదిత్య రాజయోగం ఏర్పడుతుంది. ఈ సంయోగం వల్ల చాలా రాశులకు అదృష్టం ప్రకాశిస్తుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో పెద్ద ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఆ రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం.