జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. గ్రహాలు వాటి రాశులు, పరస్పర కలయికల ద్వారా ప్రత్యేక యోగాలను ఏర్పరుస్తాయి. ఈ యోగాల ప్రభావాలు కొన్ని రాశులవారి వ్యక్తిగత జీవితాల్లో మంచి, చెడు ప్రభావాలు చూపుతాయి. మార్చిలో రెండు గ్రహాల అరుదైన కలయిక జరగనుంది. గ్రహాల రాకుమారుడు బుధుడు, కర్మఫలదాత శని దేవుడు కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరచనున్నాయి. మార్చి 7న శని మీనరాశిలో ఉదయిస్తాడు. ఈ సమయంలో, శని బుధుడితో కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. దానివల్ల 3 రాశులవారికి మేలు జరుగుతుంది. ఆ రాశులేంటో తెలుసుకుందాం.