కుజుడు, చంద్రుడు… రెండూ ముఖ్యమైన గ్రహాలే. వీరిద్దరి గమనం రాశులపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. అతి త్వరలో వీరిద్దరూ ఒకే రాశిలో కలవబోతున్నారు. జనవరి 18న కుజుడు, చంద్రుల కలయిక జరుగుతుంది. ఈ కలయిక మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం మూడు రాశుల వారిపై ప్రభావం చూపబోతోంది. ఆ మూడు రాశుల వారికి ఈ యోగం ఉన్నంత కాలం మట్టి పట్టకున్నా బంగారమే అవుతుంది. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి. 2026 సంవత్సరం ప్రారంభంలో జనవరి 18న కుజుడు, చంద్రుల కలయిక వల్ల ఏర్పడే ఈ యోగం కొత్త ఏడాదిలో మొదటి రాజయోగం కావడంతో రాశులకు కూడా అత్యధిక మేలు జరిగే అవకాశం ఉంది. దాదాపు 18 నెలల తర్వాత ఈ యోగం మళ్లీ ఏర్పడుతుంది. దీని వల్ల మూడు రాశుల వారి జీవితంలో సంపద, సంతోషం, గౌరవం అందుతాయి.