విశ్వసనామ సంవత్సరంలో విమాన ప్రమాదాలు అధికంగా జరిగే అవకాశాలు ఉన్నాయని వేణు స్వామి అన్నారు. అలాగే పడవ, రైలు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయన్నారు. వచ్చే ఏప్రిల్,మే నెలలో భూకంపాలు వచ్చే అవకాశం ఉందని అన్నారు. ఈ ఏడాది విడాకులు పెరిగే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. రవి మానవ సంబంధాలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉండొచ్చని వేణుస్వామి తెలిపారు. ఈ ఏడాది ఆడవారికి పదవులు వరిస్తాయన్నారు. అయితే నేరాల్లో మహిళల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుందని వేణుస్వామి చెప్పుకొచ్చారు. ఈ ఏడాది ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తులకు సమస్యలు వచ్చే అవకాశం ఉందని తెలిపారు. తెలుగు సినిమా, రాజకీయ రంగంలో సంచలనాలు జరిగే అవకాశం ఉందని వేణుస్వామి చెప్పుకొచ్చారు.
నోట్: ఈ వివరాలు కేవలం ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి తెలిపిన అంశాలను క్రోడీకరించి అందించడం జరిగింది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.