తెలంగాణలో ప్రస్తుతం పొడి వాతావరణం కొనసాగుతోంది... రాబోయే రెండుమూడు రోజుల్లో అక్కడక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుండి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే ఇవాళ్టి(జనవరి 12) నుండి ఏ జిల్లాలోనూ సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదయ్యే అవకాశాలు లేవని ప్రకటించింది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుండి 20 డిగ్రీలలోపు నమోదవుతాయట. ఆదిలాబాద్, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, కొమ్రంభీం ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, మల్కాజ్ గిరి, నిర్మల్,నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్, వరంగల్, భువనగిరి జిల్లాల్లో 11 నుండి 15 డిగ్రీలు... మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకు పైగా టెంపరేచర్స్ నమోదవుతాయని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది.