ఏమిటీ ఇ-నోస్, ఇ-టంగ్ టెక్నాలజీ..
సాధారణంగా అహార పదార్థాలు బాగున్నాయో లేవో వాసనను చూసి చెప్పవచ్చు... రుచిని టేస్ట్ చూసి చెప్పవచ్చు. ఇందుకు తగినట్లు మనిషి ముక్కు, నాలుక పనిచేస్తాయి. సేమ్ టు సేమ్ ఇలాగే సాంకేతికతను ఉపయోగించిన అహార పదార్థాల నాణ్యతను కనుగొనే విధానమే ఈ 'ఇ-నోస్', 'ఇ-టంగ్' వ్యవస్థ. దీని తిరుమల ప్రసాదంలో కల్తీ జరగకుండా ఉపయోగించనున్నారు.
'ఇ-నోస్' అనేది మనిషి ముక్కు మాదిరిగా అహార పదార్థాల నాణ్యతను వాసనను బట్టి గుర్తిస్తుంది. ప్రత్యేకమైన సెన్సార్ వ్యవస్థ ద్వారా ఇది పనిచేస్తుంది... ముందుగానే ప్రోగ్రామ్ చేసిన వాసనకు ఇది సరిపోతే అహారం నాణ్యతలో ఎలాంటి లోపం లేదని గుర్తిస్తుంది.
ఇ-టంగ్ అనేది మన నాలుకలో ఉన్న టేస్ట్ బడ్స్ మాదిరిగా పనిచేస్తాయి. అహారంలో తిపి, పులుపు వంటివి సరిపోయాయో లేదో ఇది తెలియజేస్తుంది... ఏదైనా తేడా ఉంటే వెంటనే అలర్ట్ చేస్తుంది.
ఇలా ఇ-నోస్, ఇ-టంగ్ ద్వారా క్షణాల్లో తిరుమలలో అహార పదార్థాల నాణ్యతను తెలుసుకోవచ్చు. తద్వారా కల్తీని నివారించి ప్రసాదం పవిత్రతను కాపాడవచ్చు. ఈ ఇ-నోస్, ఇ-టంగ్ పరికాలను ప్రాన్స్ నుండి తీసుకువచ్చినట్లు.. వీటికోసమే రూ.3 కోట్లపై పైగా ఖర్చు చేసినట్లు ఏపీ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు.