ఇక తెలంగాణకు కూడా పిడుగుల ప్రమాదం పొంచివుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది. ఆదిలాబాద్, కొమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్,నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలకు ఈ ప్రమాదం ఎక్కువని తెలిపింది. ఈ జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలతో పాటు పిడుగులు, ఈదురుగాలుల (గంటకు 30-40 కి.మీ వేగం) ప్రమాదం ఉందట... దీంతో ఎల్లో అలర్ట్ జారీ చేశారు.